ఢిల్లీలో షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్
- February 25, 2020
ఢిల్లీ: భారత దేశ రాజధాని ఢిల్లీ లో పౌరసత్వ సవరణ చట్టం ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఈశాన్య ఢిల్లీ లో పరిస్థితులు ఇప్పట్లో అదుపులోకి వచ్చే అవకాశం కనపడటం లేదు. దీనితో షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారి చేసారు ఢిల్లీ పోలీసులు. ఆందోళనలను అదుపులోకి తీసుకోచ్చేందుకే ఈ నిర్ణయం అని చెప్పారు. సియెఏ వ్యతిరేక వర్గానికి పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ,ముఖ్యంగా చాంద్ బాగ్ లో పరిస్థితులు అదుపు తప్పాయి. ఆందోళన కారులపై భాష్పావాయు గోళాలను పోలీసులు ప్రయోగించారు.
ముఖ్యంగా ఆ ప్రాంత౦ లో షాపులు, బైక్ లకు, కార్ లకు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. దీనితో పరిస్థితి ఒక్కసారిగా ఆందోళన కరంగా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ పరిస్తితిపై ఆందోళన వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్ట౦ విషయంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. గత నాలుగు రోజుల నుంచి ఇది హింసకు దారి తీసింది. దీనితో ప్రజలు బయటకు రావాలి అంటేనే భయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి.
ఇప్పటికే ఈ ఆందోళనల్లో పది మంది మరణించారు. అందులో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. ఇప్పటికే ఈ ఆందోళనలపై కేంద్ర హోం శాఖ, ఢిల్లీ ప్రభుత్వం సమీక్షలు నిర్వహించారు. ఢిల్లీ లా అండ్ ఆర్డర్ కమీషనర్ గా ఆర్ శ్రీవాస్తవ ను నియమించారు. ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాల్లో రేపు స్కూల్స్ కి సెలవు ప్రకటించారు అధికారులు. మొత్తం ఆరు ప్రాంతాల్లో ఈ ఆందోళనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. ఎప్పుడు ఎం జరుగుతుందా అనే ఆందోళన అక్కడి ప్రజల్లో నెలకొంది. అటు ఢిల్లీ ప్రభుత్వం కూడా దీనిని సమర్ధవంతంగా ఎదుర్కొంటామని చెప్తుంది.పోలీసులు సోషల్ మీడియా పుకార్లపై ప్రత్యేక మానిటరింగ్ చేపట్టారు. భద్రతా ఏర్పాట్లను 1000 మంది పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?