అమెరికాలో ముగ్గురు తెలుగువాళ్లు మృతి
- February 25, 2020అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువాళ్లు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో హైదరాబాద్కు చెందిన భార్యాభర్తలతో పాటు ఏపీకి చెందిన మరో వ్యక్తి ఉన్నారు. హైదరాబాద్లోని ముషీరాబాద్ గాంధీనగర్కు చెందిన రాజా గవిని (41), దివ్య ఆవుల (34) భార్యాభర్తలు. వీరిద్దరూ టెక్సాస్లోని ఫ్రిస్కోలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం తమ కుమార్తె రియాను డ్యాన్స్ క్లాస్ వద్ద విడిచిపెట్టారు. తిరిగి వస్తున్న మార్గంలో స్థానికంగా నిర్మాణం చేపట్టిన తమ సొంత ఇంటిని పరిశీలించేందుకు విజయవాడ ప్రాంతానికి చెందిన స్నేహితుడు ప్రేమ్నాథ్ రామనాథం (42)ను తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఎఫ్ఎం 423 ఇంటర్సెక్షన్ వద్దకు రాగానే ఈ ముగ్గురూ వెళ్తున్న కారును ఓ ట్రక్ వేగంగా ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ