షార్జా ఫోరంలో ప్రసంగించనున్న ప్రియాంకా చోప్రా

- February 26, 2020 , by Maagulf
షార్జా ఫోరంలో ప్రసంగించనున్న ప్రియాంకా చోప్రా

షార్జా:బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా, 9వ ఎడిషన్‌ షార్జా ఇంటర్నేషనల్‌ గవర్నమెంట్‌ కమ్యూనికేషన్‌ ఫోరం (ఐజిసిఎఫ్‌) గెస్ట్‌ స్పీకర్‌గా ప్రకటించబడ్డారు. మార్చి 4న ఎక్స్‌పో సెంటర్‌లో ప్రియాంకా చోప్రా ఈ మేరకు ప్రసంగం చేస్తారు. ప్రియాంకా చోప్రా కేవలం బాలీవుడ్‌ నటి మాత్రమే కాదు, యూనిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 60కి పైగా సినిమాల్లో నటించిన ప్రియాంకా చోప్రా, ఆయా సినిమాల్లో భిన్నమైన పాత్రల్ని పోషించారు. మరీ ముఖ్యంగా సామాజిక బాధ్యత నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లోనూ ఆమె సత్తా చాటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com