బహ్రెయిన్:వెంటాడుతున్న కరోనా వైరస్..మరో 7 కొత్త కేసులు నమోదు
- February 28, 2020బహ్రెయిన్:ఎన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిన ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వెంటాడుతూనే ఉంది. కరోనా పుట్టిన చైనాలో వైరస్ తీవ్రత తగ్గుతున్నా..ఇతర దేశాల్లో వేగంగా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ నుంచి కింగ్ డమ్ వస్తున్న వారిలోనే ఎక్కువగా వైరస్ బయటపడుతోంది. లేటెస్ట్ మరో ఏడుగురికి కోవిడ్-19 టెస్టులో పాజిటీవ్ అని తేలింది. దీంతో కింగ్ డమ్ లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 33కి పెరిగింది. కొత్తగా వైరస్ బారిన పడిన ఏడుగురు ఇరాన్ నుంచి వచ్చినవారే కావటం గమనార్హం. ఇరాన్ నుంచి నేరుగా కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వీరు బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. కోవిడ్-19 పాజిటీవ్ అని నిర్ధారణ అయిన వెంటనే వారిని ఇబ్రహీం ఖలీల్ కనూ కమ్యూనిటీ మెడికల్ సెంటర్ లోని ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు హెల్త్ మినిస్ట్రి ప్రకటించింది. అలాగే వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కరోనా ఎఫెక్టెడ్ పేషేంట్లతో క్లోజ్ మూవ్ అయిన వ్యక్తులను కూడా బయట తిరగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు.
--రాజేశ్వర్ (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా