రియాద్:కరోనా అలర్ట్.. వర్క్, బిజినెస్ వీసా హోల్డర్స్ పై నో బ్యాన్
- February 28, 2020రియాద్:కరోనా వైరస్ ఎఫెక్ట్ తో గల్ప్ కోఆపరేటీవ్ కౌన్సిల్ దేశాలు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే..ఉపాధి కోసం వచ్చే వారికి సౌదీ అరేబియా గుడ్ న్యూస్ తెలిపింది. వర్క్ వీసా, ఎంప్లాయ్ మెంట్ వీసా, బిజినెస్ వీసా, ఫ్యామిలి విజిట్ వీసాలపై తమ దేశానికి వచ్చే వారిపై ఎలాంటి నిషేధం లేదని క్లారిటీ ఇచ్చింది. అదే సమయంలో అన్ని రకాల టూరిజం వీసాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇక మల్టిపుల్ రీ ఎంట్రీ వీసా హోల్డర్స్ కు కొన్ని కండీషన్స్ పెట్టింది. మల్టిపుల్ వీసా హోల్డర్స్ సౌదీ అరేబియాకు రావాలంటే కరోనా ఎఫెక్టెడ్ కంట్రీస్ లో రెండు వారాలుగా విజిట్ చేయలేదని అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది.
ఇక కరోనా వైరస్ ఎఫెక్టెడ్ కంట్రీస్ లిస్టులో ఉన్న చైనా, చైనీస్ తైపీ, హాంకాంగ్, ఇరాన్, ఇటలీ, దక్షిణ కొరియా, మకావో, జపాన్, థాయ్లాండ్, మలేషియా, ఇండోనేషియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, ఫిలిప్పీన్స్, సింగపూర్, ఇండియా, లెబనాన్, సిరియా, యెమెన్, అజర్బైజాన్, కజాఖ్స్తాన్, ఉజ్బెకిస్తాన్, సోమాలియా నుంచి టూరిజం వీసాలను అనుమతించబోమని హెల్త్ మినిస్ట్రి స్పష్టం చేసింది. అలాగే ఆయా దేశాల నుంచి వచ్చే ఎయిర్ లైన్ క్రూకి కూడా అనుమతి నిషేధం అమల్లో ఉండనుంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు