విశాఖలో పర్యటించి తీరుతా:చంద్రబాబు
- February 28, 2020
అమరావతి: త్వరలో విశాఖలో పర్యటించి తీరుతానని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్ని సార్లు ఆపగలుగుతారో చూస్తానని మండిపడ్డారు. విశాఖ ఘటనలో పోలీసుల తీరుపై గవర్నర్కు ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయస్థానానికి వెళ్లాలని తెదేపా నిర్ణయించింది. నిన్నటి విశాఖ పరిణామాలపై పార్టీ నేతలతో చంద్రబాబు శుక్రవారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
అనుమతి ఇచ్చిన కార్యక్రమానికి ఆటంకాలు సృష్టించడం ఏంటని నిలదీశారు. పోలీసుల తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్న చంద్రబాబు.. వైకాపా కార్యకర్తలు పోలీసుల సహకారం లేకుండా విమానాశ్రయానికి ఎలా రాగలిగారని ప్రశ్నించారు. కాన్వాయ్పై దాడికి దిగిన వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని ఆక్షేపించిన ఆయన.. పోలీసుల సహకారంతోనే వైకాపా నిరసనలు అని స్పష్టమైందని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..