దోహాలో చారిత్రాత్మక ఘటన..
- February 28, 2020
దోహాలో శనివారం చారిత్రాత్మక ఘటన చోటుచేసుకోనుంది. అమెరికా, ఆఫ్ఘన్ తాలిబాన్ల మధ్య శనివారం శాంతి ఒప్పందం జరగనుంది. ఈ మైలురాయి ఒప్పందానికి భారత్ కూడా హాజరుకానుంది. అందులో భాగంగా ఖతార్లోని భారత రాయబారి హాజరుకానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. భారత రాయబారి పి.కుమారన్ హాజరవుతారని తెలుస్తోంది. ఈ ఒప్పందంతో తాలిబాన్లతో కూడిన ఒప్పందం కార్యక్రమానికి భారత్ అధికారికంగా హాజరుకావడం ఇదే తొలిసారి అవుతుంది. కాగా ఈ చారిత్రాత్మక ఒప్పందం ఆఫ్ఘనిస్తాన్ నుండి యుఎస్ బలగాలను ఉపసంహరించుకునేందుకు వీలు కల్పిస్తుంది. 2001 నుండి ఆఫ్ఘనిస్తాన్ లో 2,400 మంది సైనికులను అమెరికా కోల్పోయింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







