దోహాలో చారిత్రాత్మక ఘటన..
- February 28, 2020
దోహాలో శనివారం చారిత్రాత్మక ఘటన చోటుచేసుకోనుంది. అమెరికా, ఆఫ్ఘన్ తాలిబాన్ల మధ్య శనివారం శాంతి ఒప్పందం జరగనుంది. ఈ మైలురాయి ఒప్పందానికి భారత్ కూడా హాజరుకానుంది. అందులో భాగంగా ఖతార్లోని భారత రాయబారి హాజరుకానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. భారత రాయబారి పి.కుమారన్ హాజరవుతారని తెలుస్తోంది. ఈ ఒప్పందంతో తాలిబాన్లతో కూడిన ఒప్పందం కార్యక్రమానికి భారత్ అధికారికంగా హాజరుకావడం ఇదే తొలిసారి అవుతుంది. కాగా ఈ చారిత్రాత్మక ఒప్పందం ఆఫ్ఘనిస్తాన్ నుండి యుఎస్ బలగాలను ఉపసంహరించుకునేందుకు వీలు కల్పిస్తుంది. 2001 నుండి ఆఫ్ఘనిస్తాన్ లో 2,400 మంది సైనికులను అమెరికా కోల్పోయింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







