దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు సోదాలు
- January 22, 2016
దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని ఎన్ఐఏకు సమాచారం అందింంది. దీంతో దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్లీలో ముగ్గురు, హైదరాబాద్లో నలుగురు, బెంగళూరులో ఆరుగురు అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 26న దిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలను భగ్నం చేయాలనే ఐస్ఐఎస్ ఉగ్రవాదులు కుట్రపన్నినట్లు నిఘావర్గాలు భావిస్తున్నాయి. ఇటీవలే పంజాబ్లోని పఠాన్కోట్ సైనిక స్థావరంలో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. దిల్లీ నగరంలోకి ముగ్గురు అనుమానిత వ్యక్తులు ప్రవేశించినట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. అనుమానిత వ్యక్తులు కారు డ్రైవర్ను చంపి పఠాన్కోట్ నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. దిల్లీ, పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దిల్లీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ నౌకలను కాల్చిపారేయండి: ట్రంప్
- వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం









