పెన్షన్ పధకం..జగన్ సంచలన నిర్ణయం

- March 01, 2020 , by Maagulf
పెన్షన్ పధకం..జగన్ సంచలన నిర్ణయం

జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు.  ముఖ్యంగా సంక్షేమ పధకాల విషయంలో తీసుకునే నిర్ణయాలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.  ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ కోసమే అధికంగా నిధులు కేటాయిస్తోంది.  ప్రతినెలా ఈ పెన్షన్ కోసం రూ. 1320 కోట్ల రూపాయలు కేటాయిస్తోంది. జనవరి వరకు 55 లక్షల మంది రాష్ట్రంలో పెన్షన్ అందుకుంటుండగా, ఈ నెల నుంచి మరో 5 లక్షలమందికి లబ్ది చేకూరబోతున్నది.  

మొత్తంగా 60 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నారు.  మరో ఐదు లక్షల మందికి కొత్తగా పెన్షన్ ఇవ్వబోతుండటంతో అదనంగా ప్రభుత్వంపై రూ. 200 కోట్ల రూపాయల భారం పడింది.  అయితే, ఈ ఏడాది ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో 10శాతం నిధులను పెన్షన్ పథకం కోసం కేటాయించబోతున్నట్టు తెలుస్తోంది.  ఇది సంచలన నిర్ణయం అని చెప్పాలి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com