కువైట్లో పూటుగా మద్యం తాగిన భారత వ్యక్తి...
- March 01, 2020కువైట్: గుర్తు తెలియని ఓ భారత వ్యక్తి పీకలదాకా మద్యం సేవించి ఆగి ఉన్న కారు వెనక వైపు నేలపై పడుకొని ఉండడంతో కువైట్లోని హవల్లి పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ఆగి ఉన్న కారు వెనక వైపు నేలపై కునుకు తీయడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మొదట ఆ వ్యక్తిని దూరం నుంచి చూసిన స్థానికులు అతనికి కరోనా వైరస్ సోకిందేమోనని దగ్గరికి కూడా వెళ్లలేదు. మరికొందరైతే అతను గుండెపోటుతో చనిపోయి ఉండొచ్చని దూరం నుంచే చూస్తూ ఉండిపోయారు. ఇంతలో అక్కడికి వచ్చిన పారామెడిక్స్, పోలీస్ సిబ్బంది అతని దగ్గరికి వెళ్లి గమనించడంతో అసలు విషయం తెలిసింది. అతను పూటుగా మద్యం తాగి పడిపోయినట్లు గుర్తించారు. దాంతో వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని హవల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!