ఎం.ఎ యూసుఫ్ అలికి సౌదీ ప్రీమియం రెసిడెన్సీ
- March 03, 2020
సౌదీ అరేబియా:లులు గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ అలాగే యూఏఈ బేస్డ్ వ్యాపారవేత్త ఎంఏ యూసుఫ్అలి, సౌదీ అరేబియా ‘ప్రీమియం రెసిడెన్సీ’ పర్మిట్ని పొందారు. ఈ మేరకు లులు గ్రూప్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘనత దక్కించుకున్న తొలి భారతీయుడిగా ఆయన గుర్తింపు పొందారు. ప్రీమియవ్ు రెసిడెన్సీ సెంటర్ ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొంటూ, కింగ్డవ్ు, వ్యాపారవేత్తలకు డెస్టినేషన్గా మారుతోందని, ఎకానమీలో మెరుగైన వృద్ధిని సాధిస్తోందని వెల్లడించింది. గత నవంబర్లో సౌదీ అరేబియా 73 మంది అప్లికెంట్స్కి ప్రీమియం రెసిడెన్సీని గ్రాంట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. బిజినెస్ లైసెన్సుల్ని సులభంగా పొందడం, రియల్ ఎస్టేట్ లేదా వ్యాపారం ఓనర్షిప్ని స్పాన్సర్ లేకుండా పొందడం వంటివి ఈ ప్రీమియం రెసిడెన్సీతో సాధ్యమవుతాయి. యూసుఫ్ అలీ మాట్లాడుతూ, ఈ గౌరవం దక్కించుకోవడం చాలా ఆనందంగా వుందన్నారు. సౌదీ అరేబియా అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషిస్తానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. లులు గ్రూప్ 35కి పైగా హైపర్ మార్కెట్లు అలాగే సూపర్ మార్కెట్లను సౌదీ అరేబియాలో నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







