ఎం.ఎ యూసుఫ్ అలికి సౌదీ ప్రీమియం రెసిడెన్సీ
- March 03, 2020
సౌదీ అరేబియా:లులు గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ అలాగే యూఏఈ బేస్డ్ వ్యాపారవేత్త ఎంఏ యూసుఫ్అలి, సౌదీ అరేబియా ‘ప్రీమియం రెసిడెన్సీ’ పర్మిట్ని పొందారు. ఈ మేరకు లులు గ్రూప్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘనత దక్కించుకున్న తొలి భారతీయుడిగా ఆయన గుర్తింపు పొందారు. ప్రీమియవ్ు రెసిడెన్సీ సెంటర్ ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొంటూ, కింగ్డవ్ు, వ్యాపారవేత్తలకు డెస్టినేషన్గా మారుతోందని, ఎకానమీలో మెరుగైన వృద్ధిని సాధిస్తోందని వెల్లడించింది. గత నవంబర్లో సౌదీ అరేబియా 73 మంది అప్లికెంట్స్కి ప్రీమియం రెసిడెన్సీని గ్రాంట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. బిజినెస్ లైసెన్సుల్ని సులభంగా పొందడం, రియల్ ఎస్టేట్ లేదా వ్యాపారం ఓనర్షిప్ని స్పాన్సర్ లేకుండా పొందడం వంటివి ఈ ప్రీమియం రెసిడెన్సీతో సాధ్యమవుతాయి. యూసుఫ్ అలీ మాట్లాడుతూ, ఈ గౌరవం దక్కించుకోవడం చాలా ఆనందంగా వుందన్నారు. సౌదీ అరేబియా అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషిస్తానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. లులు గ్రూప్ 35కి పైగా హైపర్ మార్కెట్లు అలాగే సూపర్ మార్కెట్లను సౌదీ అరేబియాలో నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







