మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కరోనా కల్లోలం..ఖతార్ లో 8కి చేరిన పాజిటీవ్ కేసులు
- March 03, 2020
దోహా:చైనాలో వైరస్ వ్యాప్తి కంట్రోల్ అవుతోందని అనుకునే లోపే కరోనా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో పడగ విప్పింది. చైనా వెలుపల వైరస్ ధాటికి అల్లాడిపోతున్న దేశాలు మిడిల్ ఈస్ట్ లోనే ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్ లో పరిస్థితి అదుపు తప్పుతోంది. అక్కడి నుంచి గల్ఫ్ కంట్రీస్ కు వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ఆందోళన కలిగించే అంశం. ఇరాన్ లో కరోనా మృతుల సంఖ్య 66కి పెరిగింది. కరోనా రోగుల సంఖ్య 1,501 కి పెరిగింది. చైనా తర్వాత కరోనా విరుచుకుపడ్డ దేశం ఇరాన్ మాత్రమే. ఇక గల్ఫ్ కంట్రీస్ లో ఇప్పటికే కువైట్లో 56, బహ్రెయిన్లో 49, యూఏఈలో 21, ఒమన్లో 6, ఖతార్లో 7 కేసులు నమోదయ్యాయి. లేటెస్ట్ గా ఖతార్ మరో పాజిటీవ్ కేసు నమోదైంది. దీంతో కరోనా ఎఫెక్టెడ్ పేషెంట్ల లిస్ట్ ఎనిమిదికి పెరిగింది. ఈ కొత్త బాధితుడు కూడా ఇరాన్ నుంచి వచ్చిన వ్యక్తే. ఇరాన్ నుంచి తమ పౌరులను తీసుకొచ్చిన ఖతార్ అతన్ని ఇప్పటివరకు ఇతరులతో కాంటాక్ట్ కాకుండా జాగ్రత్త పడటం ఊరటనిచ్చే అంశం. ఫిబ్రవరి 27న అతన్ని ఖతార్ కు తీసుకురాగా..ఐదు రోజుల తర్వాత వైరస్ పాజిటీవ్ గా తేలింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







