ఢిల్లీలో మరో ఆరుగురికి కోవిడ్-19

- March 03, 2020 , by Maagulf
ఢిల్లీలో మరో ఆరుగురికి కోవిడ్-19

కరోనా వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ, ఢిల్లీ, రాజస్థాన్ లో వైద్యసాయం పై ఆరా తీస్తోంది. ఇదిలావుంటే, సోమవారం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన ఢిల్లీ వ్యక్తి.. నోయిడాలో శుక్రవారం బర్త్ డే పార్టీ ఇచ్చినట్టు గుర్తించారు. బర్త్ డే పార్టీలో బాధితుడి పిల్లలతో పాటు.. వారి స్నేహితులు, కొందరు తల్లిదండ్రులు, టీచర్లు పాల్గొన్నారు. వీరిలో ఆరుగురు కరోనా బారిన పడినట్టు గుర్తించిన కేంద్రం.. వారి రక్తనమూనాలను పుణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించింది. బాధితులను ఐసోలేషన్ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

ఇక, బర్త్ డే పార్టీకి హాజరైన పిల్లలందరికీ అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యగా పిల్లలు చదువుతున్న స్కూల్ కు మూడు రోజుల పాటు సెలవు ప్రకటించారు. పరీక్షలను కూడా వాయిదా వేశారు. మంగళవారం మధ్యాహ్నం వరకు స్కూల్ తో సంబంధం వున్న 40 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com