దోహా:ఓ ఐడియాతో దోహా మెట్రో కార్డ్స్ కు పెరిగిన డిమాండ్

- March 03, 2020 , by Maagulf
దోహా:ఓ ఐడియాతో దోహా మెట్రో కార్డ్స్ కు పెరిగిన డిమాండ్

దోహా మెట్రో రైల్ సర్వీసులో పేపర్ టికెట్ల యూసేజ్ ను భారీగా తగ్గించేందుకు చేపట్టిన చర్యలు ఆశించిన ఫలితాన్ని ఇస్తున్నాయి. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ యాక్షన్ లో భాగంగా గత నెల 20న పేపర్ టికెట్లపై ధరలను పెంచింది దోహా మెట్రో రైల్వే. ఫిబ్రవరి 20కి ముందున్న 2QR ఉన్న టికెట్ ధరను 3QRకు పెంచింది. అలాగే 6QRగా ఉన్న రోజు వారి పాస్ ధర 10QR కు పెంచింది. జర్నీగోల్డ్ క్లాస్ టికెట్ రేటు 10QR నుంచి 15QRకి, 30QRగా ఉన్న గోల్డ్ క్లాస్ ఒక రోజు పాస్ రేటును 45QRకు పెంచారు. ఫిబ్రవరి 21 నుంచి ఈ పెరిగిన రేట్లు అమల్లోకి వచ్చాయి. అయితే..మెట్రో కార్డ్స్ రేట్లను మాత్రం పెంచలేదు. మెట్రోలో పేపర్ టికెట్లను తగ్గించే లక్ష్యంతో దోహా మెట్రో ఈ చర్యలు చేపట్టింది. దోహా మెట్రో చేపట్టిన ఈ చర్యలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయి. పేపర్ టికెట్ల రేట్లు పెరిగినప్పటి నుంచి మెట్రో కార్డ్స్ కు డిమాండ్ పెరిగింది. గత వారం రోజులుగా ఈ డిమాండ్ మరింత ఎక్కువైంది. ఒక్కో వ్యక్తి రెండు, మూడు కార్డులు తీసుకుంటున్నారని దోహా మెట్రో అధికారులు వెల్లడించారు. ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా మెట్రో కార్డులు కొంటున్నారని దోహా మెట్రో అధికారులు వెల్లడించారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com