కరోనా వైరస్: ఇండియాకి వెళ్ళే యూఏఈ ప్రయాణీకుల సెల్ఫ్ డిక్లరేషన్
- March 04, 2020
దుబాయ్: యూఏఈ నుంచి ఇండియాకి వెళ్ళే భారత వలసదారులు, ఇతర ప్రయాణీకులు ఓ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి వుంటుంది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అన్ని ఎయిర్లైన్స్లు ప్రయాణీకులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లను అందించాలని కోరింది. ఈ ఫామ్లో, ప్రయాణీకులు తమ పూర్తి వివరాల్ని వెల్లడించాల్సి వుంటుంది. 14 రోజులుగా తాము ఏయే దేశాల్లోని ఏయే ప్రాంతాల్లో పర్యటించిందీ దాంట్లో పేర్కొనాలి. అదే సమయంలో ఇండియాలో ఎక్కడికి వెళుతున్నారు, వారి అడ్రస్, ఫోన్ నెంబర్ వంటివి కూడా ఫామ్లో ప్రస్తావించాల్సి వుంటుంది. దగ్గు, జ్వరం, జలుబు వంటి అనారోగ్య సమస్యలపైనా డిక్లరేషన్లో ప్రస్తావించాల్సిందే. కాగా, చైనా, హాంగ్కాంగ్, సౌత్ కొరియా, ఇటలీ, ఇరాన్ మరియు ఇతర కోవిడ్ 19 ఎఫెక్టెడ్ దేశాల నుంచి వచ్చేవారికి స్క్రీనింగ్ తప్పనిసరి చేశారు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)

తాజా వార్తలు
- ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్
- ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!
- న్యూ ముస్లిం’ కార్డు సర్వీస్ ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్లో భారీగా పొగాకు ఉత్పత్తులు సీజ్..!!
- యూఏఈలో 42 డొమెస్టిక్ వర్కర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలపై కొరడా..!!
- ఇరాన్కు ట్రంప్ హెచ్చరిక.. చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు
- రోడ్డుపై వాహనాలను వదిలేస్తే.. స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక..!!
- సోషల్ మీడియాలో పిల్లల దోపిడీ ఘటనలు పెరగడంపై OHRC ఆందోళన..!!
- భారత్ ఖాతాలో మరో మూడు మెడల్స్







