కరోనా వైరస్: ఇండియాకి వెళ్ళే యూఏఈ ప్రయాణీకుల సెల్ఫ్ డిక్లరేషన్
- March 04, 2020
దుబాయ్: యూఏఈ నుంచి ఇండియాకి వెళ్ళే భారత వలసదారులు, ఇతర ప్రయాణీకులు ఓ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి వుంటుంది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అన్ని ఎయిర్లైన్స్లు ప్రయాణీకులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లను అందించాలని కోరింది. ఈ ఫామ్లో, ప్రయాణీకులు తమ పూర్తి వివరాల్ని వెల్లడించాల్సి వుంటుంది. 14 రోజులుగా తాము ఏయే దేశాల్లోని ఏయే ప్రాంతాల్లో పర్యటించిందీ దాంట్లో పేర్కొనాలి. అదే సమయంలో ఇండియాలో ఎక్కడికి వెళుతున్నారు, వారి అడ్రస్, ఫోన్ నెంబర్ వంటివి కూడా ఫామ్లో ప్రస్తావించాల్సి వుంటుంది. దగ్గు, జ్వరం, జలుబు వంటి అనారోగ్య సమస్యలపైనా డిక్లరేషన్లో ప్రస్తావించాల్సిందే. కాగా, చైనా, హాంగ్కాంగ్, సౌత్ కొరియా, ఇటలీ, ఇరాన్ మరియు ఇతర కోవిడ్ 19 ఎఫెక్టెడ్ దేశాల నుంచి వచ్చేవారికి స్క్రీనింగ్ తప్పనిసరి చేశారు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)

తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







