ఇండియా నుంచి వచ్చిన విమానంలో ఎమర్జన్సీ ఎవాక్యుయేషన్‌

- March 04, 2020 , by Maagulf
ఇండియా నుంచి వచ్చిన విమానంలో ఎమర్జన్సీ ఎవాక్యుయేషన్‌

మస్కట్‌: ఒమన్‌ ఎయిర్‌, ఇండియా నుంచి వచ్చిన ఓ విమానం ఎమర్జన్సీ ఎవాక్యుయేషన్‌కి గురైనట్లు వెల్లడించింది. మస్కట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి వచ్చిన విమానంలో స్మోక్‌ ఇండికేషన్‌ కారణంగా, ఎమర్జన్సీ ఎవాక్యుయేషన్‌ చేశారు. ఈ క్రమంలో ఎవరికీ ఎలాంటి అనారోగ్య సమస్యలూ తలెత్తలేదనీ, ప్రయాణీకులంతా క్షేమంగా వుండేలా తగిన చర్యలు తీసుకున్నామనీ, ప్రొసీజర్‌ అనంతరం ప్రయాణీకులంతా వారి వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకున్నారని ఒమన్‌ ఎయిర్‌ వెల్లడించింది. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఒమన్‌ ఎయిర్‌ పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com