కరోనా ఎఫెక్ట్ తో యూఏఈలో 4 వారాల పాటు స్కూల్స్, కాలేజీలు క్లోజ్
- March 04, 2020
యూఏఈ:మెరుపు వేగంతో విస్తరిస్తున్న కరోనా వైరస్ నియంత్రించేందుకు యూఏఈ అన్ని ముందస్తు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన యూఏఈ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్స్, కాలేజీలకు వచ్చే ఆదివారం నుంచి 4 వారాల పాటు సెలవులు ప్రకటించింది. ఇది దేశ వ్యాప్తంగా ఉన్న అన్నీ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు వర్తిస్తుందని ట్వీట్ ద్వారా తెలిపింది. అంతేకాదు..ఎడ్యూకేషన్ ఇన్సిట్యూట్స్ లో శానిటైసింగ్ ప్రొగ్రాం చేపట్టింది. నిజానికి స్టూడెంట్స్ కి స్ప్రింగ్ వేకేషన్ మార్చి 29 నుంచి ఏప్రిల్ 12 వరకు ఉంది. కానీ, కరోనా వ్యాప్తితో వెకేషన్ ను మార్చి 8 నుంచి 29కి మార్చారు. ఇప్పటికే సిలబస్ అయిపోయిన నేపథ్యంలో పిల్లలకు ఇంటి దగ్గరే చదువుకునే వాతావరణం కలిపించాలని కూడా ప్రభుత్వం తన సర్క్యూలర్ లో తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







