శర్వానంద్,కిశోర్ తిరుమల కాంబినేషన్లో కొత్త సినిమా
- March 06, 2020
శర్వానంద్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై ఒక చిత్రాన్ని నిర్మించేందుకు సుధాకర్ చెరుకూరి సన్నాహాలు చేస్తున్నారు. శర్వానంద్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన ఈ కొత్త సినిమాని ప్రకటించారు.
భిన్న కథలతో సినిమాలు చేస్తూ చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన శర్వానంద్ ఇప్పుడు కిశోర్ తిరుమలతో ఒక పూర్తి స్థాయి ఎంటర్టైనర్ చేసేందుకు అంగీకరించారు.శర్వానంద్తో తొలిసారిగా పడి పడి లేచే మనసు చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ప్రస్తుతం ఆయన రానా హీరోగా విరాటపర్వం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శర్వానంద్తో ఆయన నిర్మించ తలపెట్టిన సినిమా నిర్మాతగా ఆయనకు మూడవది.ఎప్పుడు ఈ సినిమా మొదలయ్యేదీ, తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









