కరోనా అలర్ట్: అందరికీ ఫేస్ మాస్క్లు అవసరంలేదు!
- March 06, 2020
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ - ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ అహ్మద్ అల్ మోతావా మాట్లాడుతూ, కువైట్కి 3 మిలియన్లకు పైగా మాస్క్లు ఇటీవల వచ్చాయనీ, అయితే ఫేస్ మాస్క్లు అందరికీ అవసరం లేదని, ఎవరికైతే అనుమానిత లక్షణాలు వుంటాయో వారు మాత్రం, మాస్క్లు ధరిస్తే సరిపోతుందని చెప్పారు. రెస్పిరేటరీ సమస్యలతో బాధపడుతున్నవారికి వైద్య చికిత్స అందించేవారికి మాస్క్ల అవసరం వుంటుందని వివరించారు అల్ ముతావా. అందరూ మాస్క్లు ఉపయోగించాలని ఏ ప్రపంచ సంస్థా సూచించడంలేదని ఆయన తెలిపారు. మూడు లేయర్స్ వున్న మాస్క్లు వినియోగించడం మంచిదేనని ఆయన సమాధానమిచ్చారు ఓ ప్రశ్నకు స్పందిస్తూ. హ్యుమిడిటీని ఫీలయితే వెంటనే మాస్క్ని మార్చాలని, దాన్ని కేవలం వెనుక నుంచి మాత్రమే తీసి, జాగ్రత్తగా పారవేయాలని చెప్పారు అల్ ముతావా.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







