కరోనా అలర్ట్: అందరికీ ఫేస్ మాస్క్లు అవసరంలేదు!
- March 06, 2020
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ - ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ అహ్మద్ అల్ మోతావా మాట్లాడుతూ, కువైట్కి 3 మిలియన్లకు పైగా మాస్క్లు ఇటీవల వచ్చాయనీ, అయితే ఫేస్ మాస్క్లు అందరికీ అవసరం లేదని, ఎవరికైతే అనుమానిత లక్షణాలు వుంటాయో వారు మాత్రం, మాస్క్లు ధరిస్తే సరిపోతుందని చెప్పారు. రెస్పిరేటరీ సమస్యలతో బాధపడుతున్నవారికి వైద్య చికిత్స అందించేవారికి మాస్క్ల అవసరం వుంటుందని వివరించారు అల్ ముతావా. అందరూ మాస్క్లు ఉపయోగించాలని ఏ ప్రపంచ సంస్థా సూచించడంలేదని ఆయన తెలిపారు. మూడు లేయర్స్ వున్న మాస్క్లు వినియోగించడం మంచిదేనని ఆయన సమాధానమిచ్చారు ఓ ప్రశ్నకు స్పందిస్తూ. హ్యుమిడిటీని ఫీలయితే వెంటనే మాస్క్ని మార్చాలని, దాన్ని కేవలం వెనుక నుంచి మాత్రమే తీసి, జాగ్రత్తగా పారవేయాలని చెప్పారు అల్ ముతావా.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







