కరోనా అలర్ట్: అందరికీ ఫేస్ మాస్క్లు అవసరంలేదు!
- March 06, 2020
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ - ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ అహ్మద్ అల్ మోతావా మాట్లాడుతూ, కువైట్కి 3 మిలియన్లకు పైగా మాస్క్లు ఇటీవల వచ్చాయనీ, అయితే ఫేస్ మాస్క్లు అందరికీ అవసరం లేదని, ఎవరికైతే అనుమానిత లక్షణాలు వుంటాయో వారు మాత్రం, మాస్క్లు ధరిస్తే సరిపోతుందని చెప్పారు. రెస్పిరేటరీ సమస్యలతో బాధపడుతున్నవారికి వైద్య చికిత్స అందించేవారికి మాస్క్ల అవసరం వుంటుందని వివరించారు అల్ ముతావా. అందరూ మాస్క్లు ఉపయోగించాలని ఏ ప్రపంచ సంస్థా సూచించడంలేదని ఆయన తెలిపారు. మూడు లేయర్స్ వున్న మాస్క్లు వినియోగించడం మంచిదేనని ఆయన సమాధానమిచ్చారు ఓ ప్రశ్నకు స్పందిస్తూ. హ్యుమిడిటీని ఫీలయితే వెంటనే మాస్క్ని మార్చాలని, దాన్ని కేవలం వెనుక నుంచి మాత్రమే తీసి, జాగ్రత్తగా పారవేయాలని చెప్పారు అల్ ముతావా.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









