కరోనా అలర్ట్ : యూఏఈలో 17 ఏళ్ల స్టూడెంట్ కు కరోనా పాజిటీవ్
- March 06, 2020యూఏఈలో లేటెస్ట్ గా మరో వ్యక్తికి కోవిడ్-19 పాజీటీవ్ వచ్చింది. 17 ఏళ్ల ఎమిరాతి స్టూడెంట్ కు కరోనా సోకినట్లు మినిస్ట్రి ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ MOHAP అధికారులు ప్రకటించారు. ఈ లేటెస్ట్ కేసుతో యూఏఈలో కరోనా కేసుల సంఖ్య 29కి పెరిగింది. కరోనా పాజిటీవ్ అని నిర్ధారణ అయిన బాలుడ్ని వెంటనే ఐసోలేట్ వార్డుకు తరలించి అవసరమైన చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం అతని హెల్త్ కండీషన్ స్టేబుల్ గా ఉందని చెబుతున్నారు. 17 ఏళ్ల స్టూడెంట్ కు కరోనా పాజిటీవ్ అని తేలటంతో ఎమిరాతి స్టూడెంట్ చదువుతున్న స్కూల్ కు సెలవులు ప్రకటించారు. స్పెషలిస్ట్ టీమ్స్ తో స్కూల్ ప్రాంగణంలో అవసరమైన స్టెరిలైజేషన్ పనులు చేపట్టారు. అలాగే బాలుడితో డైరెక్ట్ కాంటాక్ట్ అయినవారికి కూడా కోవిడ్-19 టెస్టులు చేపట్టారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం