అబుధాబి: 2 వారాల్లో ఫైన్స్ పై 50% డిస్కౌంట్ గడువు ఫినిష్..సద్వినియోగం చేసుకోవాలని సూచన
- March 06, 2020
అబుధాబి:ఫైన్స్ చెల్లింపుల్లో 50% డిస్కౌంట్ డెడ్ లైన్ ముంచుకొస్తోంది. మరో రెండు వారాల్లోగా జరిమానాలు చెల్లించిన వారికి మాత్రమే డిస్కౌంట్ వర్తించనుంది. మార్చి 22తో గడువు ముగుస్తందని ఆలోగా మోటరిస్టులు ఫైన్ చెల్లించకుంటే పూర్తి ఎమౌంట్ చెల్లించాల్సి ఉంటుందని అధికారులు గుర్తు చేశారు. మోటరిస్టులు తమ వాహనాలపై ఉన్న ఫైన్లను క్లియర్ చేసుకునేందుకు గతేడాది చివర్లో తొలిసారిగా డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు. డిసెంబర్ 22 కంటే ముందు విధించిన జరిమానాలను ఫిఫ్టి పర్సెంట్ డిస్కౌంట్ తో చెల్లించొచ్చని...అందుకు మార్చి 22 వరకు గడువు విధించిన విషయం తెలిసిందే. అంతేకాదు పెనాల్టీ పాయింట్స్ లో కూడా మినహాయింపు ఉంటుంది. అయితే..50% డిస్కౌంట్ కు అర్హులు కాని వారి కోసం ఎర్లీ పేమెంట్ ఇన్సెంటీవ్ ఆఫర్ కూడా ప్రకటించింది. ఫైన్ విధించిన 60 రోజుల్లోగా డబ్బులు చెల్లించిన వారికి 35% రిడక్షన్ ప్రకటించారు. అయితే..సీరియస్ వయోలేషన్స్ కేసులో మాత్రం డిస్కౌంట్, పాయింట్స్ మినహాయింపులు వర్తించవని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ట్రాఫిక్ వయోలేషన్స్ ఇష్యూస్ లో పెనాల్టీ పాయింట్స్ 24 దాటితే మోటరిస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది.
----సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







