అబుధాబి: 2 వారాల్లో ఫైన్స్ పై 50% డిస్కౌంట్ గడువు ఫినిష్..సద్వినియోగం చేసుకోవాలని సూచన
- March 06, 2020అబుధాబి:ఫైన్స్ చెల్లింపుల్లో 50% డిస్కౌంట్ డెడ్ లైన్ ముంచుకొస్తోంది. మరో రెండు వారాల్లోగా జరిమానాలు చెల్లించిన వారికి మాత్రమే డిస్కౌంట్ వర్తించనుంది. మార్చి 22తో గడువు ముగుస్తందని ఆలోగా మోటరిస్టులు ఫైన్ చెల్లించకుంటే పూర్తి ఎమౌంట్ చెల్లించాల్సి ఉంటుందని అధికారులు గుర్తు చేశారు. మోటరిస్టులు తమ వాహనాలపై ఉన్న ఫైన్లను క్లియర్ చేసుకునేందుకు గతేడాది చివర్లో తొలిసారిగా డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు. డిసెంబర్ 22 కంటే ముందు విధించిన జరిమానాలను ఫిఫ్టి పర్సెంట్ డిస్కౌంట్ తో చెల్లించొచ్చని...అందుకు మార్చి 22 వరకు గడువు విధించిన విషయం తెలిసిందే. అంతేకాదు పెనాల్టీ పాయింట్స్ లో కూడా మినహాయింపు ఉంటుంది. అయితే..50% డిస్కౌంట్ కు అర్హులు కాని వారి కోసం ఎర్లీ పేమెంట్ ఇన్సెంటీవ్ ఆఫర్ కూడా ప్రకటించింది. ఫైన్ విధించిన 60 రోజుల్లోగా డబ్బులు చెల్లించిన వారికి 35% రిడక్షన్ ప్రకటించారు. అయితే..సీరియస్ వయోలేషన్స్ కేసులో మాత్రం డిస్కౌంట్, పాయింట్స్ మినహాయింపులు వర్తించవని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ట్రాఫిక్ వయోలేషన్స్ ఇష్యూస్ లో పెనాల్టీ పాయింట్స్ 24 దాటితే మోటరిస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది.
----సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!