అబుధాబి: 2 వారాల్లో ఫైన్స్ పై 50% డిస్కౌంట్ గడువు ఫినిష్..సద్వినియోగం చేసుకోవాలని సూచన
- March 06, 2020అబుధాబి:ఫైన్స్ చెల్లింపుల్లో 50% డిస్కౌంట్ డెడ్ లైన్ ముంచుకొస్తోంది. మరో రెండు వారాల్లోగా జరిమానాలు చెల్లించిన వారికి మాత్రమే డిస్కౌంట్ వర్తించనుంది. మార్చి 22తో గడువు ముగుస్తందని ఆలోగా మోటరిస్టులు ఫైన్ చెల్లించకుంటే పూర్తి ఎమౌంట్ చెల్లించాల్సి ఉంటుందని అధికారులు గుర్తు చేశారు. మోటరిస్టులు తమ వాహనాలపై ఉన్న ఫైన్లను క్లియర్ చేసుకునేందుకు గతేడాది చివర్లో తొలిసారిగా డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు. డిసెంబర్ 22 కంటే ముందు విధించిన జరిమానాలను ఫిఫ్టి పర్సెంట్ డిస్కౌంట్ తో చెల్లించొచ్చని...అందుకు మార్చి 22 వరకు గడువు విధించిన విషయం తెలిసిందే. అంతేకాదు పెనాల్టీ పాయింట్స్ లో కూడా మినహాయింపు ఉంటుంది. అయితే..50% డిస్కౌంట్ కు అర్హులు కాని వారి కోసం ఎర్లీ పేమెంట్ ఇన్సెంటీవ్ ఆఫర్ కూడా ప్రకటించింది. ఫైన్ విధించిన 60 రోజుల్లోగా డబ్బులు చెల్లించిన వారికి 35% రిడక్షన్ ప్రకటించారు. అయితే..సీరియస్ వయోలేషన్స్ కేసులో మాత్రం డిస్కౌంట్, పాయింట్స్ మినహాయింపులు వర్తించవని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ట్రాఫిక్ వయోలేషన్స్ ఇష్యూస్ లో పెనాల్టీ పాయింట్స్ 24 దాటితే మోటరిస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది.
----సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్