కరోనా అలర్ట్ : యూఏఈలో 17 ఏళ్ల స్టూడెంట్ కు కరోనా పాజిటీవ్
- March 06, 2020
యూఏఈలో లేటెస్ట్ గా మరో వ్యక్తికి కోవిడ్-19 పాజీటీవ్ వచ్చింది. 17 ఏళ్ల ఎమిరాతి స్టూడెంట్ కు కరోనా సోకినట్లు మినిస్ట్రి ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ MOHAP అధికారులు ప్రకటించారు. ఈ లేటెస్ట్ కేసుతో యూఏఈలో కరోనా కేసుల సంఖ్య 29కి పెరిగింది. కరోనా పాజిటీవ్ అని నిర్ధారణ అయిన బాలుడ్ని వెంటనే ఐసోలేట్ వార్డుకు తరలించి అవసరమైన చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం అతని హెల్త్ కండీషన్ స్టేబుల్ గా ఉందని చెబుతున్నారు. 17 ఏళ్ల స్టూడెంట్ కు కరోనా పాజిటీవ్ అని తేలటంతో ఎమిరాతి స్టూడెంట్ చదువుతున్న స్కూల్ కు సెలవులు ప్రకటించారు. స్పెషలిస్ట్ టీమ్స్ తో స్కూల్ ప్రాంగణంలో అవసరమైన స్టెరిలైజేషన్ పనులు చేపట్టారు. అలాగే బాలుడితో డైరెక్ట్ కాంటాక్ట్ అయినవారికి కూడా కోవిడ్-19 టెస్టులు చేపట్టారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం









