కువైట్: ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ యూజ్ చేసుకోండి..ఇంటిరీయర్ మినిస్ట్రి సజిషన్
- March 06, 2020
కువైట్ రెసిడెన్స్, ప్రవాసీయులు ఈ-సర్వీస్ సేవలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని ఇంటిరియర్ మినిస్ట్రి పిలుపునిచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్తలు చేపట్టిన కువైట్ ప్రభుత్వం..దేశంలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో సిటిజన్స్, ఎక్స్ పాట్స్, ఎంప్లాయిస్ ఈ-సర్వీసెస్ అడ్వాంటేజ్ ను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. www.moi.gov.kw ద్వారాగానీ, స్మార్ట్ ఫోన్ యాప్స్ ద్వారాగానీ ఈ-సర్వీస్ సేవలను పొందొచ్చని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ-సర్వీస్ సేవలను వినియోగంచటం ద్వారా ఆయా సేవలు అందించే ఆఫీసుల దగ్గర క్రౌడ్ ను తగ్గించే అవకాశం ఏర్పడుతుందని తెలిపింది. డొమస్టిక్ హెల్పర్స్ ఈ-సర్వీసెస్ ద్వారా రెసిడెన్సీ రెన్యూవల్ చేసుకోవచ్చు. అలాగే అర్టికల్ 20, ఆర్టికల్ 18 వీసా హోల్డర్స్ కూడా ఈ-సర్వీస్ ప్రయోజనాలను పొందవచ్చని ఇంటీరియర్ మినిస్ట్రి క్లారిటీ ఇచ్చింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









