అబుధాబి:హద్దు దాటితే స్మార్ట్ గేట్ తో చుక్కలే..మోటరిస్టులకు వార్నింగ్
- March 07, 2020
అబుధాబి:రోడ్లపై నిబంధనలను పాటించకుండా ర్యాష్ డ్రైవింగ్ చేసే వారికి కళ్లెం వేసింది అబుధాబి పోలీస్. హైపై స్మార్ట్ సెన్సార్ టవర్ లను ఏర్పాటు చేసింది. ఈ టవర్ కు అమర్చిన కెమెరా ద్వారా ట్రాఫిక్ వయోలేటర్స్ ను గుర్తించి ఫైన్ విధించనున్నారు. ఓవర్ స్పీడుతో వెళ్లేవారు ఓవర్ స్పీడుతో వెళ్లినా..వాహనల ఎక్స్ పైర్ అయినా ఆటోమేటిక్ గా మోటరిస్ట్ కు ఫైన్ పడుతుంది. అందుకే ఓవర్ స్పీడుతో పాటు ట్రాఫిక్ నిబంధనలను ఎవరూ ఉల్లంఘించ వద్దని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే రైట్ సైడ్ పార్కింగ్, ట్రాఫిక్ బ్లాక్ చేసిన మోటరిస్టులను కూడా స్మార్ట్ సెన్సార్ టవర్ ద్వారా గుర్తించవచ్చు. ప్రస్తుతం యూఏఈలో ఏర్పాటు చేసిన ఈ తొలి స్మార్ట్ సెన్సార్ టవర్ ద్వారా వాతావరణ సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. ప్రతీకూల వాతావరణ పరిస్థితులలో స్మార్ట్ గేట్ టవర్ ద్వారా ప్రసారం చేసే సందేశాలకు వాహనదారులు కట్టుబడి ఉండాలని, రేడియో స్టేషన్లు, సోషల్ మీడియా ద్వారా అబుధాబి పోలీసులు ప్రసారం చేసిన హెచ్చరికలను అనుసరించాలని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







