బహ్రెయిన్ : 77కి చేరిన కరోనా కేసులు..ప్రకటించిన హెల్త్ మినిస్ట్రి

- March 08, 2020 , by Maagulf
బహ్రెయిన్ : 77కి చేరిన కరోనా కేసులు..ప్రకటించిన హెల్త్ మినిస్ట్రి

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ పై బహ్రెయిన్ సమర్ధవంతంగా పోరాడుతోంది. ఎక్కువగా విదేశాల నుంచి వచ్చిన వారిలోనే వైరస్ పాజిటీవ్ గా కనిపిస్తోంది. దీంతో ఫారెనర్స్ దేశంలోకి ఎంటర్ అయ్యే అన్ని ప్లేసుల్లోనూ థర్మల్ స్క్రీనింగ్ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 77 మందికి వైరస్ వ్యాపించిటన్లు బహ్రెయిన్ హెల్త్ మినిస్ట్రి ప్రకటించింది. ఇందులో 76 మంది హెల్త్ కండీషన్ స్టేబుల్ గా ఉంటే..ఒకరి పరిస్థితి మాత్రం క్రిటికల్ గా ఉంది. కోలుకున్న వారిలో ఆరుగురిని డిశ్చార్జ్ చేశారు. ఈ 77 మందిలో 75 మంది అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్లే కావటం విశేషం. మరో ఇద్దరికి మాత్రం వైరస్ సోకిన వ్యక్తులను కాంటాక్ట్ అవటం ద్వారా వైరస్ అటాక్ అయ్యినట్లు హెల్త్ మినిస్ట్రి వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 6499 మందికి టెస్ట్ నిర్వహించగా..6422 మందికి నెగటీవ్ అని తేలింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com