షార్జా: ఖోర్ ఫక్కన్ మౌంన్టేన్ పై చిక్కుకుపోయిన 8 మంది ట్రెక్కర్స్..రక్షించిన రెస్క్యూ టీమ్స్
- March 08, 2020
పర్వాతారోహణకు వెళ్లిన ఎనిమిది మంది ట్రెక్కర్స్ కొండ అంచుకు వెళ్లగానే అక్కడే చిక్కుకుపోయారు. ఖోర్ ఫక్కన్ మౌంన్టేన్ ను అధిరోహించిన ఆ ఎనిమిది మందికి మళ్లీ
వెనక్కి తిరిగొచ్చే మార్గం కనిపించలేదు. దీంతో కొండపైనే సాయం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. విషయం తెల్సుకున్న రెస్క్యూ సెంటర్ వారిని కాపాడేందుకు ఈస్ట్రన్ రీజినల్ పోలీస్, సివిల్ డిఫెన్స్, క్రిటికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, కోస్టల్ ప్రొటెక్షన్ అధికారులతో రెస్క్యూ టీంను ఏర్పాటు చేసింది. ట్రెక్కర్స్ చిక్కుకుపోయిన లోకేషన్ ను ట్రేస్ చేసిన వెంటనే చాపర్ సాయంతో ముగ్గురిని ఎయిర్ లిఫ్ట్ చేశారు. మిగిలిన ఐదుగురిని సివిల్ డిఫెన్స్, క్రిటికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, కోస్టల్ ప్రొటెక్షన్ సాయంతో రక్షించారు. దీంతో ఎనిమిది ట్రెక్కర్స్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అనంతరం రెస్క్యూ సెంటర్ అధికారులు మాట్లాడుతూ.. ట్రెక్కర్స్ అంతా ఎక్స్ ట్రా కాషన్స్ పాటించాలని, ముఖ్యంగా రిమోట్ ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేసేటప్పుడు అదనపు జాగ్రత్త చర్యలు అవసరమని సూచించారు. అలాగే కమ్యూనికేషన్ డివైజెస్ తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







