షార్జా: ఖోర్ ఫక్కన్ మౌంన్టేన్ పై చిక్కుకుపోయిన 8 మంది ట్రెక్కర్స్..రక్షించిన రెస్క్యూ టీమ్స్
- March 08, 2020
పర్వాతారోహణకు వెళ్లిన ఎనిమిది మంది ట్రెక్కర్స్ కొండ అంచుకు వెళ్లగానే అక్కడే చిక్కుకుపోయారు. ఖోర్ ఫక్కన్ మౌంన్టేన్ ను అధిరోహించిన ఆ ఎనిమిది మందికి మళ్లీ
వెనక్కి తిరిగొచ్చే మార్గం కనిపించలేదు. దీంతో కొండపైనే సాయం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. విషయం తెల్సుకున్న రెస్క్యూ సెంటర్ వారిని కాపాడేందుకు ఈస్ట్రన్ రీజినల్ పోలీస్, సివిల్ డిఫెన్స్, క్రిటికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, కోస్టల్ ప్రొటెక్షన్ అధికారులతో రెస్క్యూ టీంను ఏర్పాటు చేసింది. ట్రెక్కర్స్ చిక్కుకుపోయిన లోకేషన్ ను ట్రేస్ చేసిన వెంటనే చాపర్ సాయంతో ముగ్గురిని ఎయిర్ లిఫ్ట్ చేశారు. మిగిలిన ఐదుగురిని సివిల్ డిఫెన్స్, క్రిటికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, కోస్టల్ ప్రొటెక్షన్ సాయంతో రక్షించారు. దీంతో ఎనిమిది ట్రెక్కర్స్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అనంతరం రెస్క్యూ సెంటర్ అధికారులు మాట్లాడుతూ.. ట్రెక్కర్స్ అంతా ఎక్స్ ట్రా కాషన్స్ పాటించాలని, ముఖ్యంగా రిమోట్ ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేసేటప్పుడు అదనపు జాగ్రత్త చర్యలు అవసరమని సూచించారు. అలాగే కమ్యూనికేషన్ డివైజెస్ తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచించారు.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







