భారత్‍కు తప్పని నిరాశ...వరల్డ్ కప్ విన్నర్ ఆస్ట్రేలియా

- March 08, 2020 , by Maagulf
భారత్‍కు తప్పని నిరాశ...వరల్డ్ కప్ విన్నర్ ఆస్ట్రేలియా

టాపార్డర్ కుదేలైన వేళ.. టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ 2020ను చేజార్చుకుంది టీమిండియా మహిళల జట్టు. అద్భుతమైన హిట్టింగ్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా.. భారత్‌కు 185పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చేధనలో తడబడిన భారత్ ఘోర వైఫల్యం చెంది 85పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. అంచెలంచెలుగా ఎదిగి ఫైనల్స్‌కు చేరుకున్న టీమిండియా మహిళల జట్టు ట్రోఫీని ఉమెన్స్ డే రోజున చేజార్చుకోవడం బాధాకరం.

ఆసీస్ ఓపెనర్లు.. అలెస్సా హీలీ(75), బెత్ మోనీ(78)హిట్టింగ్‌తో చెలరేగిపోతే భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరు దీప్తి శర్మ(33)మాత్రమే. మిగిలిన వారిలో 20కి మించని స్కోరుతో వేద కృష్ణమూర్తి(19), రిచా ఘోష్(18), స్మృతి మంధాన(11)లు సరిపెట్టుకున్నారు. ఇటీవల రికార్డులతో చెలరేగి ఫుల్ ఫామ్‌లో కనిపించిన షఫాలీ వర్మ(2), తానియా భాటియా(2), జెమీమా రోడ్రిగ్స్(0), హర్మన్ ప్రీత్ కౌర్(4), శిఖా పాండే(1), రాధా యాదవ్(1), పూనమ్ యాదవ్(1), రాజేశ్వరీ గైక్వాడ్(1)లతో పరాజయాన్ని మూటగట్టుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com