కరోనా ఎఫెక్ట్:రీఫండ్, ఫ్రీ ట్రావెల్ డేట్ చేంజ్..కరోనాతో యూఏఈ ఎయిర్ లైన్స్ ఆఫర్
- March 08, 2020
దుబాయ్:కరోనా వైరస్ కారణంగా యూఏఈ ఎయిర్ లైన్ సంస్థలు ప్రయాణికులకు వెసులుబాటు కల్పించాయి. ప్రయాణాలను రద్దు చేసుకున్నా, ట్రావెల్ డేట్ ను చేంజ్ చేసుకున్నా పెనాల్టీ చార్జెస్ కట్ చేయబోమని ప్రకటించాయి. టికెట్ రద్దు చేసుకుంటే మొత్తం డబ్బులు రీఫండ్ చేస్తామని వెల్లడించాయి. ట్రావెల్ డేట్ ను మార్చుకున్నా చేంజ్ ఫీజ్ చెల్లించాల్సిన అవసరం లేదు. దుబాయ్ బేస్ ఎమిరాతిస్ ఎయిర్ లైన్స్ లో మార్చి 7 నుంచి మార్చి 31 వరకు ఈ ఆఫర్ ప్రయాణికులకు వర్తిస్తుంది. అబుదాబి బేస్డ్ ఎతిహాద్ ఎయిర్ లైన్స్ లో జూన్ 30లోపు ట్రావెల్ చేసే వారు తమ ప్రయాణాలను జులై 15కి మార్చుకున్నా చేంజ్ ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్లై దుబాయ్ కూడా టికెట్ల రద్దు, డేట్ చేంజెస్ పై ఫెనాల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. షార్జా బేస్డ్ ఎయిర్ అరేబియా కూడా పెనాల్టీ చార్జెస్ ఉండబోవని క్లారిటీ ఇచ్చింది. కరోనా కారణంగా సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఇరాన్, కువైట్ వెళ్లే వారు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నా, డేట్ చేంజ్ చేసుకున్నా పెనాల్టీ చార్జెస్ ఉండబోవని తమ అధికారిక వెబ్ సైట్ లో ప్రకటించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







