కరోనా ఎఫెక్ట్:రీఫండ్, ఫ్రీ ట్రావెల్ డేట్ చేంజ్..కరోనాతో యూఏఈ ఎయిర్ లైన్స్ ఆఫర్
- March 08, 2020
దుబాయ్:కరోనా వైరస్ కారణంగా యూఏఈ ఎయిర్ లైన్ సంస్థలు ప్రయాణికులకు వెసులుబాటు కల్పించాయి. ప్రయాణాలను రద్దు చేసుకున్నా, ట్రావెల్ డేట్ ను చేంజ్ చేసుకున్నా పెనాల్టీ చార్జెస్ కట్ చేయబోమని ప్రకటించాయి. టికెట్ రద్దు చేసుకుంటే మొత్తం డబ్బులు రీఫండ్ చేస్తామని వెల్లడించాయి. ట్రావెల్ డేట్ ను మార్చుకున్నా చేంజ్ ఫీజ్ చెల్లించాల్సిన అవసరం లేదు. దుబాయ్ బేస్ ఎమిరాతిస్ ఎయిర్ లైన్స్ లో మార్చి 7 నుంచి మార్చి 31 వరకు ఈ ఆఫర్ ప్రయాణికులకు వర్తిస్తుంది. అబుదాబి బేస్డ్ ఎతిహాద్ ఎయిర్ లైన్స్ లో జూన్ 30లోపు ట్రావెల్ చేసే వారు తమ ప్రయాణాలను జులై 15కి మార్చుకున్నా చేంజ్ ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్లై దుబాయ్ కూడా టికెట్ల రద్దు, డేట్ చేంజెస్ పై ఫెనాల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. షార్జా బేస్డ్ ఎయిర్ అరేబియా కూడా పెనాల్టీ చార్జెస్ ఉండబోవని క్లారిటీ ఇచ్చింది. కరోనా కారణంగా సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఇరాన్, కువైట్ వెళ్లే వారు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నా, డేట్ చేంజ్ చేసుకున్నా పెనాల్టీ చార్జెస్ ఉండబోవని తమ అధికారిక వెబ్ సైట్ లో ప్రకటించింది.
తాజా వార్తలు
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!







