మస్కట్:త్వరలో ఎలక్ట్రానిక్ ఎయిర్ వే..ఏప్రిల్ 1 నుంచి పేపర్ డాక్యుమెంట్స్ బంద్
- March 08, 2020
మస్కట్:ఈ-పాలసీలో భాగంగా ఒమన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పేపర్ ఎయిర్ వే బిల్స్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఓన్లీ ఎలక్ట్రానిక్ ఎయిర్ వే బిల్స్ ను మాత్రమే అనుమతించనున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు ప్రకటించారు. కస్టమర్స్ కు మరింత సౌకర్యవంతంగా, క్వాలీటీ సర్వీస్ అందించటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో ఇక నుంచి క్లైయింట్స్ అందరూ ఎయిర్ వే బిల్స్ ను ఎలక్ట్రానికల్ గానే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కస్టమ్స్ తెలిపింది. ఒరిజినల్ వే బిల్స్ లో నమోదు చేసే డేటా వివరాలన్నింటిని డిజిటల్ గా నమోదు చేయాలని వివరించింది. ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. అదే సమయంలో ఏప్రిల్ 1 నుంచి పేపర్ డాక్యుమెంట్లను కూడా అనుమతించరు. ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ ఆపరేట్ చేసే కంపెనీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్వోపీ సూచించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







