మస్కట్:త్వరలో ఎలక్ట్రానిక్ ఎయిర్ వే..ఏప్రిల్ 1 నుంచి పేపర్ డాక్యుమెంట్స్ బంద్
- March 08, 2020
మస్కట్:ఈ-పాలసీలో భాగంగా ఒమన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పేపర్ ఎయిర్ వే బిల్స్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఓన్లీ ఎలక్ట్రానిక్ ఎయిర్ వే బిల్స్ ను మాత్రమే అనుమతించనున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు ప్రకటించారు. కస్టమర్స్ కు మరింత సౌకర్యవంతంగా, క్వాలీటీ సర్వీస్ అందించటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో ఇక నుంచి క్లైయింట్స్ అందరూ ఎయిర్ వే బిల్స్ ను ఎలక్ట్రానికల్ గానే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కస్టమ్స్ తెలిపింది. ఒరిజినల్ వే బిల్స్ లో నమోదు చేసే డేటా వివరాలన్నింటిని డిజిటల్ గా నమోదు చేయాలని వివరించింది. ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. అదే సమయంలో ఏప్రిల్ 1 నుంచి పేపర్ డాక్యుమెంట్లను కూడా అనుమతించరు. ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ ఆపరేట్ చేసే కంపెనీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్వోపీ సూచించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







