కరోనావైరస్ కారణంగా అభిమానులు లేకుండా బహ్రెయిన్ ఎఫ్ 1 రేసు
- March 08, 2020
బహ్రెయిన్:బహ్రెయిన్లో నిర్వహిస్తున్న ఫార్ములా వన్ గ్రాన్ప్రీని వీక్షకులు లేకుండానే నిర్వహించాలని నిర్వహకులు నిర్ణయం తీసుకున్నారు. ఫార్ములా వన్ మొదటి సీజన్లో రెండో రౌండ్ పోటీలకు బహ్రెయిన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ పోటీలు మార్చి 22న జరగాల్సి ఉంది. అయితే.. బహ్రెయిన్లో ఇప్పటి వరకూ 83 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు పోటీ నిర్వహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.ఫుట్బాల్, గోల్ఫ్, స్కీయింగ్, మారథాన్లు మరియు ఒలింపిక్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్లు అన్నీ వాయిదాపడ్డాయి.'ఇంతటి భారీ ఈవెంట్తో వేల సంఖ్యలో విదేశీ ప్రేక్షకులు, బహ్రెయిన్ పౌరులు ఒకే వేదిక వద్దకు రావడం ఈ పరిస్థితుల్లో మేం సరైనదిగా భావించడం లేదు.' అని పోటీ నిర్వహకులు వ్యాఖ్యానించారు.ఏప్రిల్ 19 న జరగాల్సిన షాంఘైలో చైనా గ్రాండ్ ప్రిక్స్ ఇప్పటికే వాయిదా పడింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







