కరోనావైరస్ కారణంగా అభిమానులు లేకుండా బహ్రెయిన్ ఎఫ్ 1 రేసు
- March 08, 2020
బహ్రెయిన్:బహ్రెయిన్లో నిర్వహిస్తున్న ఫార్ములా వన్ గ్రాన్ప్రీని వీక్షకులు లేకుండానే నిర్వహించాలని నిర్వహకులు నిర్ణయం తీసుకున్నారు. ఫార్ములా వన్ మొదటి సీజన్లో రెండో రౌండ్ పోటీలకు బహ్రెయిన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ పోటీలు మార్చి 22న జరగాల్సి ఉంది. అయితే.. బహ్రెయిన్లో ఇప్పటి వరకూ 83 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు పోటీ నిర్వహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.ఫుట్బాల్, గోల్ఫ్, స్కీయింగ్, మారథాన్లు మరియు ఒలింపిక్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్లు అన్నీ వాయిదాపడ్డాయి.'ఇంతటి భారీ ఈవెంట్తో వేల సంఖ్యలో విదేశీ ప్రేక్షకులు, బహ్రెయిన్ పౌరులు ఒకే వేదిక వద్దకు రావడం ఈ పరిస్థితుల్లో మేం సరైనదిగా భావించడం లేదు.' అని పోటీ నిర్వహకులు వ్యాఖ్యానించారు.ఏప్రిల్ 19 న జరగాల్సిన షాంఘైలో చైనా గ్రాండ్ ప్రిక్స్ ఇప్పటికే వాయిదా పడింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







