జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ రావల్పిండికి తరలింపు

- March 09, 2020 , by Maagulf
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ రావల్పిండికి తరలింపు

రావల్పిండి (పాకిస్థాన్): పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత, అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్ ను భద్రత కోసం రావల్పిండి నగరంలోని సురక్షిత ఇంటికి తరలించారని భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. ఇటీవల అమెరికాపై మసూద్ అజార్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పాకిస్థాన్ బహవాల్పూర్ ప్రధాన కార్యాలయం నుంచి రావల్పిండి నగరంలోని సురక్షిత ఇంటికి తరలించారని తేలింది. పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ ప్రావిన్సులోని అమరికా సాయుధ డ్రోన్ దాడులు చేస్తుందనే భయంతోనే మసూద్అజార్ ను రావల్పిండికి తరలించారని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com