దర్శక నిర్మాతగా మారిన నటి కల్యాణి..ప్రి లుక్, టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేసిన పూరి జగన్నాథ్
- March 09, 2020
అనేక సూపర్ హిట్ సినిమాల్లో నాయికగా నటించి, తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి కల్యాణి తాజాగా దర్శక నిర్మాతగా మారారు. ఇటీవలి కాలంలో అతిథి పాత్రల్లో కనిపిస్తూ వస్తున్న ఆమె కే2కే ప్రొడక్షన్స్ బ్యానర్పై ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
వాస్తవ ఘటనల ఆధారంగా విలక్షణ ప్రేమకథతో సైకలాజికల్ థ్రిల్లర్గా కల్యాణి తీస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తయారవుతోంది. ఈ సినిమా ప్రి లుక్, టీజర్ గ్లింప్స్ను హోలీ పర్వదినం సందర్భంగా సోమవారం డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆవిష్కరించారు.
చేతన్ శీను, సిద్ది, సుహాసినీ మణిరత్నం, రోహిత్ మురళి, శ్వేత ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్నది. బాలనటిగా కెరీర్ ఆరంభించిన కల్యాణి, 1986 నుంచి సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. తనకున్న విస్తృతానుభవంతో ఒకవైపు నిర్మాతగా మారుతూనే మరోవైపు దర్శకత్వాన్నీ చేపట్టారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







