దుబాయ్:రమదాన్ మాసంలో 900 వేల మందికి ఇఫ్తార్..ఓ ఛారిటీ సంస్థ ఏర్పాట్లు
- March 10, 2020
దుబాయ్:పవిత్ర రమదాన్ మాసంలో భక్తులకు ఉచితంగా భోజన ఏర్పాట్లు చేసింది బీట్ అల్ ఖైర్ సొసైటీ అనే చారిటీ సంస్థ. దాదాపు 9 లక్షల మంది భక్తులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ప్రతి రోజు ఇఫ్తార్ టెంట్లలో దాదాపు 30 వేల మందికి ఇప్తార్ మీల్స్ అందించేలా ఏర్పాట్లు చేసినట్లు బీట్ అల్ ఖైర్ డైరెక్టర్ జనరల్ అబ్దీన్ తహర్ అల్ అవదీ తెలిపారు. ప్రతీ మీల్ లో రైస్, మీట్, చికెన్, డేట్స్, ఫ్రూట్స్, వాటర్ తో పాటు పాలు కూడా అందించనున్నట్లు వివరించారు. గత ఏడాది ఇఫ్తార్ మీల్స్ కోసం dh6.7 మిలియన్ల తో 7,05,000 మందికి ఉచిత ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాదాపు 45 ఇఫ్తార్ టెంట్లలో డిస్ట్రిబ్యూట్ చేసినట్లు వెల్లడించారు. ఈద్ అల్ ఫితర్ ముగిసే వరకు రమదాన్ క్యాంపెన్ కొనసాగుతుందని పేద కుటుంబాల్లో సంతోషం నింపటమే తమ లక్ష్యనని ఆయన అన్నారు. అలాగే దాదాపు 52 వేల కుటుంబాలు భక్తులకు సేవ చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







