రాజ్ కందుకూరి చేతుల మీదుగా `1992` మూవీ పోస్టర్ - ఫస్ట్ సింగిల్ లాంచ్
- March 10, 2020పివియమ్ జ్యోతి ఆర్ట్స్ పతాకంపై మహి రాథోడ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం `1992`. ఈ చిత్రం టైటిల్ లోగో మరియు ఫస్ట్ సింగిల్ రాజ్ కందుకూరి చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ...``1992`టైటిల్ మరియు ఫస్ట్ సింగిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కొత్త వారిని ప్రోత్సహించడానికి నేనుప్పుడూ ముందుంటాను. కొత్త వారు చేస్తోన్న ఈ ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నా``అన్నారు.
దర్శకుడు శివ పాలమూరి మాట్లాడుతూ..‘‘దర్శకుడుగా ఇది నా తొలి చిత్రం. నేటి సమాజంలో ప్రేమ, పెళ్లిళ్లు ఎలా తయారయ్యాయో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక నేనెంతో ఇష్టపడే నిర్మాత రాజ్ కందుకూరి గారు మా సినిమా లోగో, ఫస్ట్ సింగిల్ లాంచ్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది. ప్రస్తుతం మూవీ లాస్ట్ షెడ్యూల్ లో ఉంది. సమ్మర్ లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం``అన్నారు.
నటుడు దిల్ రమేష్ మాట్లాడుతూ...‘‘యాత్ర `సినిమా తర్వాత మంచి పాత్రలు వస్తున్నాయి. ఇందులో హీరోయిన్ ఫాదర్ గా నటిస్తున్నా. ఒక ఇన్నోసెంట్ కుర్రాడు ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందు ఎదుర్కొన్నాడు అనేది సినిమా. ఫస్ట్ సాంగ్ రాజ్ కందుకూరి గారు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంద``న్నారు.
హీరో, నిర్మాత మహి రాథోడ్ మాట్లాడుతూ...‘‘రాజ్ కందుకూరి గారి చేతుల మీదుగా నా ఫస్ట్ సినిమా సాంగ్, టైటిల్ లోగో లాంచ్ చేయడం అదృష్టం గా భావిస్తున్నా. డైరెక్టర్ శివ గారు సినిమాను అనుకున్న విధంగా తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉందన్నారు.
హీరోయిన్ మోనా ఠాగూర్ మాట్లాడుతూ...``తెలుగులో నా ఫస్ట్ ఫిలిం ఇది. నా క్యారక్టర్ చాలా ట్రెండీగా, డిఫరెంట్ గా ఉంటుంది’’ అన్నారు.
మహి రాథోడ్, మోనా ఠాగూర్ , దిల్ రమేష్, జబర్దస్త్ రాజశేఖర్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి నిర్మాత: మహి రాథోడ్, రచన`దర్శకత్వం: శివ పాలమూరి.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక