మస్కట్ : పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఎమ్వసలాత్ కు పెరుగుతున్న డిమాండ్..ప్రతీరోజు 25,000 మంది ప్రయాణం

- March 12, 2020 , by Maagulf
మస్కట్ :  పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఎమ్వసలాత్ కు పెరుగుతున్న డిమాండ్..ప్రతీరోజు 25,000 మంది ప్రయాణం

ఒమన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఎమ్వసలాత్ బస్సులో ప్రతీ రోజు దాదాపు 25 వేల మంది ప్రయాణికులు ప్రయాణించినట్లు ఆ కంపెనీ తమ డేటా రిపోర్ట్ లో వెల్లడించింది. గతేడాది పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా దాదాపు 9.2 మిలియన్ ప్యాసింజర్స్ ప్రయాణం చేసినట్లు తెలిపింది. మస్కట్, సలాహ్, సోహర్ తో పాటు ఇంటర్ సిటీ సర్వీసుల్లో 2018 కంటే గతేడాది ప్రయాణికుల సంఖ్య 57 శాతం పెరిగినట్లు వెల్లడించింది. 2019లో ప్రతీ రోజు 25 వేల మంది ఎమ్వసలాత్ కంపెనీ బస్సుల్లో ట్రావెల్  చేశారని స్టేట్ మెంట్ లో తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com