కరోనా వైరస్: దుబాయ్ ఒయాసిస్ మాల్ మూసివేయలేదు
- March 12, 2020దుబాయ్లోని ప్రముఖ షాపింగ్ మాల్ అయిన ఒయాసిస్ మాల్ కరోనా వైరస్ కారణంగా మూసివేతకు గురయ్యిందంటూ జరుగుతున్న ప్రచారంపై సదరు మాల్ యాజమాన్యం స్పందించింది. ఇవి ఫాల్స్ రూమర్స్ అని కొట్టి పారేసింది. షాపింగ్ మాల్ యెదుట అంబులెన్స్ ఆగడం, అందులోంచి పారామెడిక్స్ మాల్లోకి వెళ్ళడం.. ఇదంతా ఓ వీడియోలో చిత్రీకరించబడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అల్ కౌజ్ ప్రాంతంలో మెడికల్ ఎమర్జన్సీ ఏర్పడితే, ఓ వ్యక్తి ఒయాసిస్ మాల్ని ల్యాండ్ మార్క్గా రిఫర్ చేశారు. దాంతో, పారామెడిక్స్ తమ డ్యూటీ తాము చేశారు. మాల్లోకి పొరపాటున పారామెడిక్స్ వచ్చారు. అంతే తప్ప, మాల్కి ఈ ఘటనకీ ఎలాంటి సంబంధం లేదని సంస్థ యాజమాన్యం పేర్కొంది. ఒయాసిస్ మాల్లో ఇప్పటిదాకా ఎలాంటి కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదనీ, కరోనా తీవ్రత నేపథ్యంలో అన్ని భద్రతా చర్యలూ తీసుకుంటున్నామని సంస్థ ప్రతినిథులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు