కరోనా వైరస్: దుబాయ్ ఒయాసిస్ మాల్ మూసివేయలేదు
- March 12, 2020
దుబాయ్లోని ప్రముఖ షాపింగ్ మాల్ అయిన ఒయాసిస్ మాల్ కరోనా వైరస్ కారణంగా మూసివేతకు గురయ్యిందంటూ జరుగుతున్న ప్రచారంపై సదరు మాల్ యాజమాన్యం స్పందించింది. ఇవి ఫాల్స్ రూమర్స్ అని కొట్టి పారేసింది. షాపింగ్ మాల్ యెదుట అంబులెన్స్ ఆగడం, అందులోంచి పారామెడిక్స్ మాల్లోకి వెళ్ళడం.. ఇదంతా ఓ వీడియోలో చిత్రీకరించబడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అల్ కౌజ్ ప్రాంతంలో మెడికల్ ఎమర్జన్సీ ఏర్పడితే, ఓ వ్యక్తి ఒయాసిస్ మాల్ని ల్యాండ్ మార్క్గా రిఫర్ చేశారు. దాంతో, పారామెడిక్స్ తమ డ్యూటీ తాము చేశారు. మాల్లోకి పొరపాటున పారామెడిక్స్ వచ్చారు. అంతే తప్ప, మాల్కి ఈ ఘటనకీ ఎలాంటి సంబంధం లేదని సంస్థ యాజమాన్యం పేర్కొంది. ఒయాసిస్ మాల్లో ఇప్పటిదాకా ఎలాంటి కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదనీ, కరోనా తీవ్రత నేపథ్యంలో అన్ని భద్రతా చర్యలూ తీసుకుంటున్నామని సంస్థ ప్రతినిథులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







