కరోనా అలర్ట్‌: షిషా బ్యాన్‌ ఆదేశాలు జారీ చేసిన అబుధాబి

- March 12, 2020 , by Maagulf
కరోనా అలర్ట్‌: షిషా బ్యాన్‌ ఆదేశాలు జారీ చేసిన అబుధాబి

అబుధాబి, అన్ని టూరిజం ఎస్టాబ్లిష్‌మెంట్స్‌లో షిషా సెర్వింగ్‌ని బ్యాన్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కల్చర్‌ అండ్‌ టూరిజం, తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ ఈ బ్యాన్‌ అమల్లో వుంటుందని తెలిపింది. కాగా, ఇప్పటికే సౌదీ అరేబియా మరియు కువైట్‌ తమ దేశాల్లో షిషాని బ్యాన్‌ చేసింది. షిషా పైప్స్‌ తరచుగా ఫ్రెండ్స్‌ మరియు ఫ్యామిలీ మెంబర్స్‌ మధ్య షేర్‌ అవుతుంటాయి.. ఇది మిడిల్‌ ఈస్ట్‌లో సాధారణంగా కన్పించే విషయమే. కాగా, ఉల్లంఘనలకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలుంటాయని షిషా బ్యాన్‌పై స్పష్టతనిచ్చింది అబుధాబి డిపార్ట్‌మెంట్‌.

--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com