కరోనా ఎఫెక్ట్: ట్రావెల్ అడ్వయిజరీ జారీ చేసిన ఇండియాలోని ఒమన్ ఎంబసీ
- March 12, 2020మస్కట్: ట్రావెల్ వీసాల్ని ఇండియా క్యాన్సిల్ చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఒమన్ ఎంబసీ, తమ పౌరులకు ట్రావెల్ అడ్వయిజరీ జారీ చేసింది. ఏప్రిల్ 15 వరకు అన్ని టూరిస్ట్ వీసాల్ని ఇండియా క్యాన్సిల్ చేసింది. వైరస్ ప్రభావం వున్న ఏడు దేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల్ని క్వారంటీన్ చేస్తున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. ఈనేపథ్యంలో ఎంబసీ, తమ పౌరులకు స్పష్టమైన సూచనలు చేసింది. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకూ తమ పౌరులు వేచి వుండాలని ఎంబసీ సూచించింది. ఇండియాలో ఇప్పటికే వున్న ఒమన్ పౌరులు, జనసమ్మర్ధం ఎక్కువగా వున్న ప్రాంతాలకు దూరంగా వుండాలని ఎంబసీ ఆదేశించింది. అత్యవసర సందర్భాల్లో ఢిల్లీ లేదా ముంబైలోని ఎంబసీలను సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం