చేనేత, ఆప్కోలో ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్న కొల్లు రవీంద్ర
- January 23, 2016
రాష్ట్రంలోని అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కళాశాలలుగా, హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మారుస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. తిరుపతిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో బీసీ విద్యార్థుల కోసం స్టడీ సర్కిల్నూ ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీసీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. అందుకనే వచ్చే ఏడాది నుంచి రూ.6,680 కోట్లతో బీసీ సబ్ప్లాన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. నెల రోజుల్లోగా తిరుపతిలో చేనేత బాజరును ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో చేనేత, ఆప్కోలో ఖాళీ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని రవీంద్ర తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







