చేనేత, ఆప్కోలో ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్న కొల్లు రవీంద్ర
- January 23, 2016
రాష్ట్రంలోని అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కళాశాలలుగా, హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మారుస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. తిరుపతిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో బీసీ విద్యార్థుల కోసం స్టడీ సర్కిల్నూ ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీసీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. అందుకనే వచ్చే ఏడాది నుంచి రూ.6,680 కోట్లతో బీసీ సబ్ప్లాన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. నెల రోజుల్లోగా తిరుపతిలో చేనేత బాజరును ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో చేనేత, ఆప్కోలో ఖాళీ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని రవీంద్ర తెలిపారు.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









