కరోనా ఎఫెక్ట్:ఫెడరల్ స్టాఫ్ కోసం రిమోట్ వర్క్ సిస్టం అనౌన్స్ చేసిన యూఏఈ
- March 14, 2020
యూఏఈ:కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు యూఏఈ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ సెక్టార్ లోని కొన్ని కేటగిరిలోని ఉద్యోగుల సెఫ్టీ కోసం రిమోట్ వర్క్ సిస్టమ్ ను అమలు పరుస్తోంది. రేపటి నుంచి రెండు వారాల పాటు ప్రభుత్వం సూచించిన ఫెడరల్ అథారిటీస్ లోని ఉద్యోగులు ఇక ఇంటి నుంచే పని చేసే వెసులుబాటు ఉంటుంది. యూఏఈ ప్రభుత్వం సోషల్ మీడియాలో తెలిపిన వివరాల ప్రకారం 9వ గ్రేడ్ అంతకంటే తక్కువ గ్రేడ్ చదువుతున్న పిల్లల తల్లులు, ఎర్లడర్లీ ఎంప్లాయిస్, ప్రెగ్నెంట్ వుమెన్, వైకల్యాలు ఉన్న ఎంప్లాయిస్, ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువగా ఉన్న ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసే ఫెసిలిటీ కల్పించనున్నారు. కోవిడ్ -19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా అబుదాబి, దుబాయ్ ప్రభుత్వాలు తమ ఎమిరేట్ల ప్రభుత్వ రంగానికి రిమోట్ వర్క్ వ్యవస్థను ప్రకటించిన తర్వాతి రోజే యూఏఈ కూడా ఫెడరల్ అథారిటీ ఎంప్లాయిస్ కు రిమోట్ వర్క్ సిస్టంను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







