కరోనా ఎఫెక్ట్:ఫెడరల్ స్టాఫ్ కోసం రిమోట్ వర్క్ సిస్టం అనౌన్స్ చేసిన యూఏఈ
- March 14, 2020
యూఏఈ:కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు యూఏఈ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ సెక్టార్ లోని కొన్ని కేటగిరిలోని ఉద్యోగుల సెఫ్టీ కోసం రిమోట్ వర్క్ సిస్టమ్ ను అమలు పరుస్తోంది. రేపటి నుంచి రెండు వారాల పాటు ప్రభుత్వం సూచించిన ఫెడరల్ అథారిటీస్ లోని ఉద్యోగులు ఇక ఇంటి నుంచే పని చేసే వెసులుబాటు ఉంటుంది. యూఏఈ ప్రభుత్వం సోషల్ మీడియాలో తెలిపిన వివరాల ప్రకారం 9వ గ్రేడ్ అంతకంటే తక్కువ గ్రేడ్ చదువుతున్న పిల్లల తల్లులు, ఎర్లడర్లీ ఎంప్లాయిస్, ప్రెగ్నెంట్ వుమెన్, వైకల్యాలు ఉన్న ఎంప్లాయిస్, ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువగా ఉన్న ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసే ఫెసిలిటీ కల్పించనున్నారు. కోవిడ్ -19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా అబుదాబి, దుబాయ్ ప్రభుత్వాలు తమ ఎమిరేట్ల ప్రభుత్వ రంగానికి రిమోట్ వర్క్ వ్యవస్థను ప్రకటించిన తర్వాతి రోజే యూఏఈ కూడా ఫెడరల్ అథారిటీ ఎంప్లాయిస్ కు రిమోట్ వర్క్ సిస్టంను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







