కువైట్:అత్యవసరం అయితే తప్ప జనంలోకి రావొద్దు..కువైట్ ప్రభుత్వ సూచన
- March 14, 2020
కువైట్:కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో కువైట్ ప్రభుత్వం ఎప్పిటికప్పుడు వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకుంటూ వస్తోంది. నిన్న ఒక్క రోజే 20 మందికి కరోనా పాజిటీవ్ అని నిర్దారణ కావటంతో కువైట్ ప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యింది. వైరస్ వ్యాప్తికి ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా అన్ని విధాల కంట్రోల్ చేయటంపై మరింత ఫోకస్ పెంచింది. ఇకపై ప్రజలు ఎవరు అత్యవసరం అయితే తప్ప జనంలోకి రావొద్దని సూచించింది. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండేలా జాగ్రత్తలు పాటించాలని కోరింది. కువైట్ మినిస్ట్రి ఆఫ్ ఇన్ఫర్మేషన్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. పబ్లిక్ గ్యాదరింగ్ ఈవెంట్స్ కు వీలైనంత వరకు దూరంగా ఉండాలని, అలాగే క్రౌడెడ్ ప్లేసెస్ కు, టూరిస్ట్ స్పాట్స్ కు వెళ్లకుండా ఉండటమే ఉత్తమమని సూచించింది. అయితే..ప్రభుత్వం సూచించిన డైరెక్షన్స్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మినిస్ట్రి ఆఫ్ ఇన్ఫర్మేషన్ కొట్టిపారేసింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు ఫిక్స్ డ్ టైం కండీషన్ అమలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, తాము అలాంటి ఆంక్షలు విధించలేదని క్లారిటీ ఇచ్చింది. కాకపోతే ప్రజలే సెల్ఫ్ డిసిషన్స్ తో పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్ దూరంగా ఉండాలని కోరింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







