మస్కట్:నిజ్వా-సలాహ్ రోడ్డుపై ఇసుక మేటలు..వాహనదారులు జాగ్రత్త!
- March 14, 2020
మస్కట్:బలమైన గాలులు వీస్తుండటంతో నిజ్వా-సలాహ్ రోడ్డుపై ఇసుక మేటలు వేసింది. దీంతో అటు వెళ్లే వాహనదారులంతా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని రాయల్ ఒమన్ పోలీసులు సూచించారు. ఇసుక మేటల కారణంగా ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీసులు ఆన్ లైన్ లో ఓ ప్రకటన విడుదల చేశారు. అల్ గబా నుండి హైమా వరకు బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయని, దాని కారణంగా రోడ్డుపై భారీగా ఇసుక పేరుకుపోయిందని వివరించారు. నిజ్వా-సలాహ్ రోడ్డు మీదుగా వెళ్లే వారు కేర్ ఫుల్ గా డ్రైవ్ చేయాలని తమ ప్రకటనలో తెలిపారు. అలాగే ROP వాహనదారుల సురక్షితమైన ప్రయాణాన్ని కోరుకుంటుందని అన్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







