మస్కట్:నిజ్వా-సలాహ్ రోడ్డుపై ఇసుక మేటలు..వాహనదారులు జాగ్రత్త!
- March 14, 2020
మస్కట్:బలమైన గాలులు వీస్తుండటంతో నిజ్వా-సలాహ్ రోడ్డుపై ఇసుక మేటలు వేసింది. దీంతో అటు వెళ్లే వాహనదారులంతా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని రాయల్ ఒమన్ పోలీసులు సూచించారు. ఇసుక మేటల కారణంగా ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీసులు ఆన్ లైన్ లో ఓ ప్రకటన విడుదల చేశారు. అల్ గబా నుండి హైమా వరకు బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయని, దాని కారణంగా రోడ్డుపై భారీగా ఇసుక పేరుకుపోయిందని వివరించారు. నిజ్వా-సలాహ్ రోడ్డు మీదుగా వెళ్లే వారు కేర్ ఫుల్ గా డ్రైవ్ చేయాలని తమ ప్రకటనలో తెలిపారు. అలాగే ROP వాహనదారుల సురక్షితమైన ప్రయాణాన్ని కోరుకుంటుందని అన్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









