మస్కట్:నిజ్వా-సలాహ్ రోడ్డుపై ఇసుక మేటలు..వాహనదారులు జాగ్రత్త!
- March 14, 2020
మస్కట్:బలమైన గాలులు వీస్తుండటంతో నిజ్వా-సలాహ్ రోడ్డుపై ఇసుక మేటలు వేసింది. దీంతో అటు వెళ్లే వాహనదారులంతా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని రాయల్ ఒమన్ పోలీసులు సూచించారు. ఇసుక మేటల కారణంగా ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీసులు ఆన్ లైన్ లో ఓ ప్రకటన విడుదల చేశారు. అల్ గబా నుండి హైమా వరకు బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయని, దాని కారణంగా రోడ్డుపై భారీగా ఇసుక పేరుకుపోయిందని వివరించారు. నిజ్వా-సలాహ్ రోడ్డు మీదుగా వెళ్లే వారు కేర్ ఫుల్ గా డ్రైవ్ చేయాలని తమ ప్రకటనలో తెలిపారు. అలాగే ROP వాహనదారుల సురక్షితమైన ప్రయాణాన్ని కోరుకుంటుందని అన్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







