భద్రాచలంలో నృత్యోత్సవంలో పాల్గొన్నారు..

- January 24, 2016 , by Maagulf
భద్రాచలంలో నృత్యోత్సవంలో పాల్గొన్నారు..

ఖమ్మం జిల్లా భద్రాచలం రామాలయం ఉత్తరద్వారం ముందు ఆదివారం భక్తరామదాసు కీర్తనలపై నృత్యాభిషేకం ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యి మంది విద్యార్థులు ఈ నృత్యోత్సవంలో పాల్గొన్నారు. ఒకే కీర్తనకు ఒకే విధంగా నృత్యం చేసి రికార్డు సృష్టించారు. తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డు, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డు, కిడ్స్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో నమోదయినట్లు ఉత్తమ ఉపాధ్యాయ అసోసియేషన్‌ అధ్యక్షులు బెక్కంటి శ్రీనివాసులు ప్రకటించారు. రామాయణ కాండలపై ప్రదర్శన పోటీలు జరుగుతున్నాయి. సాయంత్రం గోవిశ్వశాంతి యాగం, గోదావరికి హారతి సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com