కరోనా ఎఫెక్ట్:మార్చి 17కి ముందు జారీ చేసిన వీసాలు రద్దు చేసిన యూఏఈ
- March 18, 2020
యూఏఈ:కరోనా వైరస్ ను అరికట్టే చర్యల్లో భాగంగా యూఏఈ మార్చి 17కి ముందు జారీ చేసిన వీసాలను కూడా రద్దు చేసింది. ఇక కొత్త వీసాలను ఇచ్చేది లేదని కూడా స్పష్టం చేసింది. ఇప్పటికే యూఏఈ రెసిడెన్సీగా ఉన్నవారికి మాత్రమే వీసా మంజూరు చేస్తుంది. కొత్త రెసెడెన్సీ వీసాలను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేరళా నుంచి 72 ఏళ్ల వృద్ధురాలికి యూఏఈ విజిట్ వీసా ఇచ్చింది. అయితే..ఆమె అబుదాబి వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కిన తర్వాత..తన వీసా ఆటో క్యాన్సిల్ అయ్యిదంటూ తమ ట్రావెల్ ఏజెంట్ ఇన్ఫామ్ చేశాడని వృద్ధురాలి బంధువులు తెలిపారు. మార్చి 16న ఆమెకు విజిట్ వీసా వచ్చింది. అబుదాబి విమానాశ్రయ అధికారులను సంప్రదించగా..మార్చి 17కి జారీ చేసిన విజిట్ వీసాలు ఆటోమెటిక్ గా రద్దు అవుతున్నట్లు వెల్లడించారని చెబుతున్నారు. నిన్నటి నుంచే ఈ కొత్త ఆంక్షలు అమల్లోకి వచ్చినట్లు మరో అధికారి కూడా తెలిపారు. అయితే..నిన్న ఉదయం 9.45 గంటల వరకు కూడా వీసా రద్దుపై ఎలాంటి ప్రకటన లేకపోవటం గమనార్హం.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)
తాజా వార్తలు
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!







