కరోనా ఎఫెక్ట్:మార్చి 17కి ముందు జారీ చేసిన వీసాలు రద్దు చేసిన యూఏఈ
- March 18, 2020యూఏఈ:కరోనా వైరస్ ను అరికట్టే చర్యల్లో భాగంగా యూఏఈ మార్చి 17కి ముందు జారీ చేసిన వీసాలను కూడా రద్దు చేసింది. ఇక కొత్త వీసాలను ఇచ్చేది లేదని కూడా స్పష్టం చేసింది. ఇప్పటికే యూఏఈ రెసిడెన్సీగా ఉన్నవారికి మాత్రమే వీసా మంజూరు చేస్తుంది. కొత్త రెసెడెన్సీ వీసాలను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేరళా నుంచి 72 ఏళ్ల వృద్ధురాలికి యూఏఈ విజిట్ వీసా ఇచ్చింది. అయితే..ఆమె అబుదాబి వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కిన తర్వాత..తన వీసా ఆటో క్యాన్సిల్ అయ్యిదంటూ తమ ట్రావెల్ ఏజెంట్ ఇన్ఫామ్ చేశాడని వృద్ధురాలి బంధువులు తెలిపారు. మార్చి 16న ఆమెకు విజిట్ వీసా వచ్చింది. అబుదాబి విమానాశ్రయ అధికారులను సంప్రదించగా..మార్చి 17కి జారీ చేసిన విజిట్ వీసాలు ఆటోమెటిక్ గా రద్దు అవుతున్నట్లు వెల్లడించారని చెబుతున్నారు. నిన్నటి నుంచే ఈ కొత్త ఆంక్షలు అమల్లోకి వచ్చినట్లు మరో అధికారి కూడా తెలిపారు. అయితే..నిన్న ఉదయం 9.45 గంటల వరకు కూడా వీసా రద్దుపై ఎలాంటి ప్రకటన లేకపోవటం గమనార్హం.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం