కువైట్ లో మరో ఆరుగురికి కరోనా పాజిటీవ్
- March 19, 2020కువైట్:ప్రపంచ దేశాలన్ని కరోనా కుదుపుతో వణికిపోతున్నాయి. ఎన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినా, వైరస్ వ్యాప్తి నియంత్రణకు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా..కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కువైట్ లో లేటెస్ట్ మరో ఆరు కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కువైట్ లో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 148కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్ధుల్లా అల్ సనద్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు నమోదైన 148 కరోనా పాజిటీవ్ కేసుల్లో 18 మంది రికవరి అయ్యారు. మరో 130 మంది ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇందులో ఐదుగురు ఐసీయూలో ఉండగా ముగ్గురి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిపారు. ఇదిలాఉంటే 574 మంది క్వారంటైన్ గడువు ముగించుకున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్