కువైట్ లో మరో ఆరుగురికి కరోనా పాజిటీవ్
- March 19, 2020
కువైట్:ప్రపంచ దేశాలన్ని కరోనా కుదుపుతో వణికిపోతున్నాయి. ఎన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినా, వైరస్ వ్యాప్తి నియంత్రణకు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా..కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కువైట్ లో లేటెస్ట్ మరో ఆరు కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కువైట్ లో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 148కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్ధుల్లా అల్ సనద్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు నమోదైన 148 కరోనా పాజిటీవ్ కేసుల్లో 18 మంది రికవరి అయ్యారు. మరో 130 మంది ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇందులో ఐదుగురు ఐసీయూలో ఉండగా ముగ్గురి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిపారు. ఇదిలాఉంటే 574 మంది క్వారంటైన్ గడువు ముగించుకున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







