కువైట్ లో మరో ఆరుగురికి కరోనా పాజిటీవ్
- March 19, 2020కువైట్:ప్రపంచ దేశాలన్ని కరోనా కుదుపుతో వణికిపోతున్నాయి. ఎన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినా, వైరస్ వ్యాప్తి నియంత్రణకు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా..కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కువైట్ లో లేటెస్ట్ మరో ఆరు కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కువైట్ లో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 148కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్ధుల్లా అల్ సనద్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు నమోదైన 148 కరోనా పాజిటీవ్ కేసుల్లో 18 మంది రికవరి అయ్యారు. మరో 130 మంది ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇందులో ఐదుగురు ఐసీయూలో ఉండగా ముగ్గురి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిపారు. ఇదిలాఉంటే 574 మంది క్వారంటైన్ గడువు ముగించుకున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు