కువైట్ లో మరో ఆరుగురికి కరోనా పాజిటీవ్
- March 19, 2020
కువైట్:ప్రపంచ దేశాలన్ని కరోనా కుదుపుతో వణికిపోతున్నాయి. ఎన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినా, వైరస్ వ్యాప్తి నియంత్రణకు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా..కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కువైట్ లో లేటెస్ట్ మరో ఆరు కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కువైట్ లో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 148కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్ధుల్లా అల్ సనద్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు నమోదైన 148 కరోనా పాజిటీవ్ కేసుల్లో 18 మంది రికవరి అయ్యారు. మరో 130 మంది ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇందులో ఐదుగురు ఐసీయూలో ఉండగా ముగ్గురి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిపారు. ఇదిలాఉంటే 574 మంది క్వారంటైన్ గడువు ముగించుకున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!







