కరోనా అలెర్ట్:భారత అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు
- March 19, 2020ఢిల్లీ:కరోనా వైరస్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో నాల్గవ కరోనా మరణం నమోదు అవ్వడం పట్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 65 ఏళ్లు పై బడిన వృద్దులు బయటికి రాకుండా ఉండాలని తెలిపింది. అంతేకాకుండా పది సంవత్సరాల లోపు పిల్లలను బయటికి పంపకుండా చూడాలని తెలిపింది. 22 వ తేదీ నుండి 29 వరకు అంతర్జాతీయ ఫ్లైట్స్ ను రద్దు చేయాలని భావించింది. వారం రోజుల పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేయడం వలన కరోనా వైరస్ ప్రభావం తగ్గే అవకాశముంది. భారత్ లో ఇప్పటివరకు 174 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోషల్ దిస్తన్సింగ తప్పనిసరిగా పాటించాలని కేంద్రం ఆదేశించింది. ఇప్పటి వరకూ కొన్ని రాష్ట్రాలు విద్యా సంస్థలను, మాల్స్ నీ, జింలను, మ్యూజియం లను మూసి వేయాలని ఆదేశించింది. అయితే దేశవ్యాప్తంగా అన్ని ప్రత్యేక రైళ్ళను రద్దు చేసింది.
తాజా వార్తలు
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్పోర్ట్లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్