కరోనా అలెర్ట్:భారత అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

- March 19, 2020 , by Maagulf
కరోనా అలెర్ట్:భారత అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

ఢిల్లీ:కరోనా వైరస్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో నాల్గవ కరోనా మరణం నమోదు అవ్వడం పట్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 65 ఏళ్లు పై బడిన వృద్దులు బయటికి రాకుండా ఉండాలని తెలిపింది. అంతేకాకుండా పది సంవత్సరాల లోపు పిల్లలను బయటికి పంపకుండా చూడాలని తెలిపింది. 22 వ తేదీ నుండి 29 వరకు అంతర్జాతీయ ఫ్లైట్స్ ను రద్దు చేయాలని భావించింది. వారం రోజుల పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేయడం వలన కరోనా వైరస్ ప్రభావం తగ్గే అవకాశముంది. భారత్ లో ఇప్పటివరకు 174 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోషల్ దిస్తన్సింగ తప్పనిసరిగా పాటించాలని కేంద్రం ఆదేశించింది. ఇప్పటి వరకూ కొన్ని రాష్ట్రాలు విద్యా సంస్థలను, మాల్స్ నీ, జింలను, మ్యూజియం లను మూసి వేయాలని ఆదేశించింది. అయితే దేశవ్యాప్తంగా అన్ని ప్రత్యేక రైళ్ళను రద్దు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com