మలేషియా లో చిక్కుకున్న భారతీయులకు అండగా నిలిచిన మలేషియా తెలుగు ఫౌండేషన్
- March 22, 2020
మలేషియా:ఇటీవల మలేషియా లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ అవడముతో మలేషియా ప్రభుత్వం ఈ నెల 18 నుండి 31 వరకు విమానయాన సర్వీసులను పూర్తిగా నిషేదించడమయినది అలాగే భారత ప్రభుత్వం కూడా ఇదే సమయములో విమానయాన రాకపోకలను నిషేధించడంతో మలేషియా కూలాలంపూర్ ఎయిర్ పోర్ట్ లో దాదాపుగా 400 మందికి పైగా భారతీయులు చిక్కుకున్నారు. ఇందులో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మరియు చెన్నై రాష్ట్రాలకు చెందినవారు ఎక్కువగా వున్నారు. ఈ విషయం తెలుసుకున్న మలేషియా తెలుగు ఫౌండేషన్(MTF) ప్రెసిడెంట్ దాతో కాంతారావు మలేషియా ఇండియన్ హైకమిషన్ సహాయముతో వారిని ఇండియా కి వెళ్లే వరకు వారికీ కావలసిన భోజన, రవాణా వసతి సోకార్యాలను MTF ఈ నెల 31 వరకు అందించడానికి ముందుకు వచ్చింది.
ఈ సందర్భముగా సహాయ సహకారాలు అందిస్తున్న మలేషియా తెలుగు ఫౌండేషన్ దాతో కాంతారావు అక్కునాయుడు కి మరియు వారి కమిటీ సభ్యులు జనరల్ సెక్రటరీ ప్రకాష్ రావు , ట్రేసరర్ స్రీన్ జివి ,కేల ఎక్సకో జగదీష్ రావు కి మలేషియా లోని భారత రాయబార కార్యాలయం వారికీ ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేసింది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









